Friday, April 26, 2024
- Advertisement -

జగన్ తో భేటీ కానున్న మహేష్

- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమ లో అగ్ర కథానాయకులలో ఒకరు. ఈయన సినిమా కోసం ప్రాణం పెట్టేస్తాడు అంటే అతిశయోక్తి కాదు. అలాగే బిజినెస్ లో కూడా మహేష్ అంతే రేంజ్ లో స్టార్. ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసాడు అంటే, సక్సెస్ లేకుండా మాత్రం వేణు దిరగడు అని అందరూ అంటారు. ఇప్పటికే హైదరాబాద్ లో ఏఎంబీ సినిమాస్ పేరుతో మాల్స్ ప్రారంభించి తన బిజినెస్ ని విస్తరించాలి అనే కుతూహలం తో ఉన్నాడు మహేష్. అయితే తాజా ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు తన బిజినెస్ విషయమై మహేష్ బాబు త్వరలో ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ని కలవనున్నాడట.

ప్రస్తుతం విహార యాత్ర లో ఉన్న మహేష్ త్వరలో నే జగన్ ని కలిసి అభినందనలు తెలిపి, తన బిజినెస్ కి సంబందించిన వివరాలని మాట్లాడనున్నాడట. అయితే దీనికి సంబందించిన పూర్తి వివరాలు అందుబాటు లో లేవు కానీ ఈ బిజినెస్ ప్రొపోజల్ మాత్రం చాలా రోజుల నుండి పెండింగ్ లో ఉంది అని సమాచారం. ఎన్నికలు పూర్తి అయ్యాక కొత్త ప్రభుత్వం వచ్చాక తీరిగ్గా ఈ విషయమై ఒక నిర్ణయానికి రావాలని మహేష్ మరియు అతని టీమ్ అభిప్రాయపడ్డారట. అందుకే ఇదే సరైన సమయం అని వారంతా భావిస్తున్నారు.మహేష్ బాబు తో జగన్ మోహన్ రెడ్డి భేటీ ఆర్ జగన్-మహేష్ భేటీ కానున్నారా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -