- Advertisement -
ఖమ్మం కార్పొరేషన్ మేయర్ పోరులో తన సతీమణికి ఆసక్తి లేదని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. మేయర్ ఎవరనేది పార్టీ అధిష్ఠానం నిర్ణయిస్తుందని తెలిపారు. నామినేషన్ల గడువు ముగియడంతో ప్రచారానికి ఆయన శ్రీకారం చుట్టారు.
తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టాక రెండున్నరేళ్లలో ఖమ్మంలో జరిగిన అభివృద్ధిపై కరపత్రం విడుదల చేశారు. విపక్షాలవి గుడ్డి విమర్శలు తప్ప అభివృద్ధి చేయలేవని ఆరోపించారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. విపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా.. మినీ పురపోరులోనూ కారు హవా కొనసాగుతుందని పువ్వాడ తెలిపారు.
సినీమా రికార్డ్స్ బ్రేక్ చేసిన మాస్క్ లేని ప్రజలు..!
అసోం మాజీ ముఖ్యమంత్రి భూమిధర్బర్మన్ కన్నుమూత