నంద్యాల ఉప ఎన్నిక దేశ వ్యాప్తంగా ఎంతటి ఖరీదైన ఎన్నికొ తెలిసిందే. ఇది వైసీపీకి ఏమో గాని అధికార పార్టీ టీడీపీకి మాత్రం చావులాంటిదే. ఇప్పుడు అందరి చూపు ఫలితాలపైనె. గెలుపుపై రెండు పార్టీ విజయం మాదంటె..మాదెననే ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే తాజాగా మంత్రి అఖిల ప్రియ జగన్పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డికి ఎన్నికల సంఘం తేరుకోలేని షాకిచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని చంపాలన్నందుకు జగన్పై కేసు నమోదు చేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.
బహిరంగ సభలో ప్రసంగిస్తూ చంద్రబాబును నడిరోడ్డుపై కాల్చి చంపాలనీ, ఉరి తీయాలనీ పిలుపునిచ్చిన విషయం తెల్సిందే. సాక్షాత్ ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిపై జగన్ చేసిన వ్యాఖ్యలను కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్గా తీసుకుంది.
ఈ నేపథ్యంలో నంద్యాల నియోజకవర్గం వైపు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చూడాలంటేనే భయపడే రిజల్ట్ వస్తుందని మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. నంద్యాల ప్రజలంతా తన తల్లిదండ్రులపై గౌరవంతో తమ వెంటే వున్నారని చెప్పుకొచ్చారు. ఇవాళ పోలింగ్ ఇంతటి భారీ స్థాయిలో జరిగిందంటే దానికి కారణం…. ప్రజలందరూ కదిలి వచ్చి తెలుగుదేశం పార్టీకి ఓటు వేయడమేనని అన్నారు.