Saturday, April 20, 2024
- Advertisement -

బండి సంజయ్ పై ఆ మంత్రి సంచలన వ్యాఖ్యలు

- Advertisement -

తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ పై పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వరంగల్‌లో మునిసిపల్ ఎన్నికలకు సమాయత్తం కావలసిన తీరుపై ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో మంత్రి ఎర్రబెల్లి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. టీఆర్ఎస్ అధికారంలో వచ్చాక సీఎం కేసీఆర్‌తోనే అభివృద్ధి జరిగిందని ఆయన అన్నారు.

బండి సంజయ్ అవగాన లేక మాట్లాడుతున్నాడు. తాగునీటి కోసం 950 కోట్లు ఖర్చు పెట్టాం. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో రెండు సీట్లను తామే గెలుస్తామని.. ఆ తర్వాత సీఎం కేసీఆర్ ఉండడు అని బండి సంజయ్ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడాడు. ఆ స్టేట్‌మెంట్‌కి ఆయన సమాధానం చెప్పాలి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని నాలుగో స్థానంలో ఉంచారు.

ఎంపీగా సంజయ్ కరీంనగర్‌కు ఏం చెయ్యలేదు. బండి సంజయ్ మాటలు నమ్మేందుకు వరంగల్ ప్రజలు సిద్ధంగా లేరు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి ల్యాండ్ ఇచ్చాం.. ఇవ్వ లేదంటున్నారు. గిరిజన యూనివర్సిటీకి 600 ఎకరాల ఇచ్చాం. యూనివర్సిటీకి కేంద్రం లక్ష నలభై వేలు ఇచ్చింది. ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.. ప్రజలకు ప్రత్యకంగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు ఎర్రబెల్లి. హైదరాబాద్, వరంగల్‌కి కేంద్రం ఏం ఇచ్చింది? బండి పోతే బండి.. గుండు పోతే గుండు అన్న బండి సంజయ్ ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ చెయ్యలేదని అన్నారు మంత్రి ఎర్రబెల్లి.

బయట వాహనాలు లోపలకి రావు.. డీజీపీ ఆదేశాలు జారీ..!

సజ్జల రామకృష్ణారెడ్డి వివరణ..మంత్రి ఇల్లు అక్కడే ఉంది..!

FLASH : నటుడు సోనూ సూద్ కి కరోనా పాజిటీవ్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -