Tuesday, May 14, 2024
- Advertisement -

టీడీపీలో భ‌గ్గుమ‌న్న విబేధాలు….. పార్టీ కంచుకోట‌కు బీట‌లు…

- Advertisement -

అనంపురం జిల్లా టీడీపీ కంచుకోట‌కు బీట‌లు పారుతున్నాయి. పార్టీలో అంత‌ర్గ‌తంగా ఉన్న విబేధాలు మ‌రో సారి భ‌గ్గుమ‌న్నాయి. పార్టీలో చేరి త‌ప్పు చేశాన‌ని జేసీ వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా జేసీ బ్ర‌ద‌ర్స్‌కు పెద్ద ఎదురు దెబ్బ‌త‌గ‌లింది. దీంతో అనంపురం రాజ‌కీయాలు ఒక్క సారిగా సంచ‌ల‌నంగా మారాయి.

ఒకొప్పుడు కాంగ్రెస్‌లో ఉన్న జేసీ బ్ర‌ద‌ర్స్ జిల్లా రాజ‌కీయాల‌లో చ‌క్రం తిప్పేవారు. కాని ప్ర‌స్తుతం ప‌రిస్థితుల్లో మార్పు వ‌చ్చింది. దీంతో ప‌రిస్థితులు ఎదురు తిరుగుతున్నాయి. అస‌లు ఆయ‌న నియేజ‌క వ‌ర్గాల్లో తెలుగు త‌మ్ముళ్ల స‌పోర్టులేకుండా పోతోంది. టీడీపీలో చేరిన త‌ర్వాత ఆయ‌న‌తో పార్టీనేత‌లు ఎవ‌రూ స‌ఖ్య‌త‌గా లేర‌ని తెలుస్తోంది.

తాడిపత్రి లో పెత్తనం చెలాయిస్తున్న జేసీ వర్గం… అనంతపురం వచ్చే సరికి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొంటోంది. అనంతపురంలో జరిగిన స్టాండింగ్ కమిటీలో ఏకంగా జేసీ వర్గం కార్పొరేటర్లను మరో వర్గం టీడీపీ కార్పొరేటర్లు దాడి చేసి కొట్టారు. చాలాకాలంగా అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. రోడ్ల విస్తరణతో మొదలైన వివాదం రగులుతూనే ఉంది. అనంతపురంపై పట్టుసాధించేందుకు జేసీ చేసిన ప్రయత్నాలకు ప్రభాకర్ చౌదరి గండికొడుతూనే ఉన్నారు.

స్టాండింగ్ కమిటీ సమావేశం జరగ్గా…. తమ డివిజన్లలో అభివృద్ధి జరగకుండా ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అడ్డుపడుతున్నారని జేసీ వర్గం కార్పొరేటర్‌ ఒకరు ఆరోపించారు. దీంతో ఆగ్రహించిన ప్రభాకర్ చౌదరి వర్గీయులు… జేసీ వర్గం కార్పొరేటర్‌ను కొట్టి పంపించారు. దిక్కున్న చోట చెప్పుకో అంటూ వెళ్లగొట్టారు.

ఈసంఘ‌ట‌నతో జేసీ బ్ర‌ద‌ర్స్‌కు జిల్లాలో పెద్ద అవ‌మానంమే జ‌రిగింద‌నె వార్త‌లు వినిపిస్తున్నాయి. పార్టీలో చేరిన త‌ర్వాత వారికి ప్రాధాన్య‌త ఇవ్వ‌డంలేద‌ని చాలా సంద‌ర్భాల్లో జేసీ దివాక‌ర్‌రెడ్డి చెప్పారు. మ‌రి వీరి మ‌ధ్య‌నున్న విబేధాల‌ను బాబు ప‌రిస్క‌రిస్తార‌లేకా ఎమ్మెల్యే ప్ర‌భాక‌ర్ చౌద‌రికె వంత‌పాడ‌తారా అన్నది తేలాల్సి ఉంది. ఏదైనా తేడా జ‌రిగితె జేసీ బ్ర‌ద‌ర్స్ త‌మ దారి తాము చూసుకోవ‌డం ఖాయం అనే వార్త‌లు ఆయ‌న వ‌ర్గం నుంచి వినిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -