Thursday, April 25, 2024
- Advertisement -

హిజాబ్ వివాదంపై కల్వకుంట్ల కవిత ట్వీట్

- Advertisement -

ప్రస్తుతం కర్ణాటక రాజకీయాలతో పాటు దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన హిజాబ్ రగడపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. ఈ సందర్భంగా ఆమె స్వయంగా చేతితో రాసిన హిందీ కవితను తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు.

మహిళల స్రుష్టికర్తలని వస్త్రధారణ విషయంలో పూర్తి స్వేచ్ఛ వారికే ఉండాలని అన్నారు. స్వంతంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం స్త్రీలకు ఇ వ్వాలని చెప్పారు. నుదుటన సింధూరం, నచ్చిన వస్త్రాలు ధరించడం అనేవి పూర్తిగా వారికి సంబంధించిన విషయాలని తెలిపారు.

హిందూ.. ముస్లిం.. క్రిస్టియన్.. సిక్కు ఏమతమైనా మనమందరం భారతీయులమేని అన్నారు. సింధూర్.. టర్బన్.. హిబాజ్.. క్రాస్ వంటివి ఏది ధరించినా మన గుర్తింపు భారతీయతే అవుతుందని ప్రతి ఒక్కరూ ఎదుటి వారి సంప్రదాయాన్ని గౌరవించడం నేర్చుకోవాలని పోస్ట్ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -