నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్తి భూమా బ్రహ్మానందరెడ్డి . భారీ మెజారిటీతో గెలిచినసంగతి తెలిసిందే. గెలుపు అటుంచితే భూమా కుటుంబంలో అంతలోనె మరో సారి వర్గపోరు మొదలయ్యింది. బ్రహ్మానందరెడ్డిలో గెలుపు సంతోషం ఆవిరైపోతున్నట్లు తెలుస్తోంది. ఆయన స్థానంలో మౌనికాను తీసుకురావాలని టీడీపీ భారీ వ్యూహంతో ఉంది. పరిస్థితులను బట్టి చూస్తె భ్రహ్మానందరెడ్డికి వచ్చె ఎన్నికల్లో బాబు షాక్ ఇవ్వనున్నారె వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.
టీడీపీలో తనకు కాకుండా భూమా అఖిల ప్రియ చెల్లెలు మౌనికకు అధిక ప్రాధాన్యత దక్కుతుండటంతో బ్రహ్మానందరెడ్డి తీవ్ర మనస్థాపానికి గురైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారనం ఎన్నికల సమయంలో మౌనిక వ్యవహరించిన తీరు అన్నది తెలిసిందే. భూతుల వారీగా భూమా మౌనిక తిరితిన హల్చల్ చేసింది. లేడీ భూమా నాగిరెడ్డి అంటూ…వచ్చే ఎన్నికల్లో ఈమె పోటీ చేయాలవార్తలు వినిపిస్తున్నాయి. అందుకే మౌనికకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది టీడీపీ.
మౌనికకు ఇస్తున్న ప్రాధాన్యతను చూసి మంత్రి అఖిలప్రియకే కాకుండా బ్రహ్మనందరెడ్డి కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఎలాగైనా సోదరికి ప్రాధాన్యత రాకుండా చూడాలని అఖిల,బ్రహ్మనందరెడ్డి ఆలోచిస్తున్నారు. వచ్చె ఎన్నికల్లో ఆళ్లగడ్డనుంచి అఖిల నిలబడితే…నంద్యాల సీటు విషయంలో కుటుంబంలో విబేధాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఎన్నికలో మౌనిక పోటీ చేస్తే మరింత మెజారిటీ వచ్చేదని విషయాన్ని చంద్రబాబు దగ్గరికి సీనియర్ నేతలు తీసుకువెళ్లారట. తొలుత టికెట్ మౌనికాకె అనుకున్నా తర్వాత బ్రహ్మానందరెడ్డికి దక్కింది. రాజకీయాల్లోకి రావాలని మౌనిక ఆసక్తితో ఉన్నారనేది మొదట్లోనె తెలిసిపోయింది. 2019లో తాను పోటీ చేయడం ఖాయమని సన్నిహితులతో చెబుతున్నారట. అందుకే నంద్యాల ఉప ఎన్నిక సమయంలో తన ఇమేజ్ పెరిగేలా వ్యవహరించారని తెలుస్తోంది.
ఉప ఎన్నిక సమయంలో తన ఇమేజ్ పెరిగేలా వ్యవహరించారని…అందుకే మీడియాను వెంటేసుకొని పోలింగ్ బూత్ల చుట్టూ తిరిగారిని నంద్యాల వాసులు చెబుతున్నారు. భ్రహ్మానందరెడ్డి ఎక్కడా కనిపించలేదు. మౌనిక తీరే హల్చల్గా మారింది.దీంతో వచ్చే ఎన్నికల నాటికి భూమా కుటుంబంలో సీటు కోసం పోరు తప్పదని తెలుస్తోంది. అఖిలప్రియ సపోర్ట్ సొంత చెల్లికి ఉంటాదనండంలో సందేహంలేదు. చూడాలి ఏంజరుగుతుందో..!