Friday, May 3, 2024
- Advertisement -

మళ్ళీ ఇక్కడ మహమ్మారి విజృంభణ.. టార్గెట్ హైదరబాద్..!

- Advertisement -

తెలంగాణ లో కరోనా తగ్గినట్లే తగ్గి… మళ్లీ విజృంభిస్తోంది. తాజాగా మరో 247 కరోనా కేసులు నమోదయ్యాయి. జీహెచ్​ఎంసీ పరిధిలో 37 మంది మహమ్మారి బారిన పడ్డారు. మొత్తం బాధితుల సంఖ్య 3,01,769కి పెరిగింది.

వైరస్‌కు మరో ముగ్గురు బలయ్యారు. ఇప్పటివరకు 1,659 మంది మహమ్మారితో మరణించారు. తాజాగా 158 మంది బాధితులు డిశ్చార్జ్​ అయ్యారు. ఇప్పటివరకు 2,98,009 మంది కొవిడ్​ను జయించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,101 యాక్టివ్‌ కేసులున్నాయి. ప్రస్తుతం 716 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.రాష్ట్రంలో కొవిడ్ మహమ్మారి మళ్లీ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ప్రజలంతా కరోనా నిబంధనలు పాటిస్తూ వైరస్ బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ సూచించింది.

భారత్​లో కరోనా తీవ్రత మళ్లీ పెరుగుతోంది. ఒక్కరోజే దేశవ్యాప్తంగా 28,903 కొత్త కేసులు వెలుగుచూశాయి. 188 మంది వైరస్​కు బలయ్యారు.దేశంలో ఇప్పటివరకు 3 కోట్ల 50 లక్షలకుపైగా టీకా డోసుల పంపిణీ జరిగింది.

న్యూ లుక్ తో అల్లు అర్జున్..!

ముఖానికి నిమ్మరసం మంచిదేనా

గుండె సమస్యలకు ఈ మూడే కారణాలట..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -