- Advertisement -
రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ను.. ఎస్ఈబీ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ కలిశారు. ఈనెల 9న పంచాయతీ ఎన్నికల పోలింగ్ దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని ఎస్ఈసీ సూచించారు. మద్యం దుకాణాల బంద్, పంపిణీపై అప్రమత్తంగా ఉండాలన్నారు. మరోవైపు.. పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ దిల్లీరావు.. ఎస్ఈసీ రమేశ్ కుమార్తో సమావేశమయ్యారు. ‘ఇంటింటికీ రేషన్’ అనుమతించాలా వద్దా అనే అంశంపై చర్చించారు.
చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో అధిక ఏకగ్రీవాలపై ఎస్ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర ధోరణికి అనుగుణంగా ఏకగ్రీవాలు లేవని వ్యాఖ్యానించింది. అనుమతి ఇచ్చే వరకూ వాటి తుది ఫలితాల ప్రకటన నిలిపివేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
ప్రముఖ నటుడు కాంతారావు సతీమణి కన్నుమూత!
సోహెల్ తో అరియానా మళ్ళీ రెచ్చిపోయిందిగా…!
నిమ్మగడ్డ యాప్ కి షాక్.. అప్పుడే వద్దు.. హైకోర్టు సంచలన ఆదేశాలు!