ఒకప్పుడు టాలీవుడ్ లో ఎన్టీఆర్ తో సమానంగా ఎన్నో జానపద చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు కాంతారావు. తెలుగు చిత్రం పరిశ్రమలో కత్తి కాంతారావుగా పేరు తెచ్చుకున్నారు. కాంతారావు దాదాపు 400 చిత్రాలలో నటించారు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి అభిమానుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. అయితే చివరి దశలో అనారోగ్యం పాలై 2009లో కన్నుమూశారు.
దివంగత నటుడు కాంతారావు సతీమణి హైమావతి (87) అనారోగ్యంతో గురువారం మధ్యాహ్నం కన్నుమూశారు. అయితే కాంతారావు కన్నుమూసిన తర్వాత కుటుంబ సభ్యులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నట్లు అప్పట్లో ఫిలిమ్ వర్గాల్లో చర్చనడిచింది. ఈ విషయాన్ని తెలుసుకున్న తెలంగాణ ప్రభుత్వం ప్రతి నెల పదివేల రూపాయల ఆర్థిక సాయాన్ని శ్రీమతి హైమావతికి అందించే ఏర్పాటు చేసింది.
కాంతారావుకు 1940లో సుశీలతో వివాహం జరిగింది. కానీ ఆమె అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఆయన హైమావతిని 1950లో పెళ్ళి చేసుకున్నారు. కాంతారావు కన్నుమూసేవారకూ ఆయనకు ఆమె తోడునీడగా ఉన్నారు. కాగా, కాంతారావు, హైమావతి దంపతులకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
జనసేన అభిమానులకు చెక్ పెట్టిన సోము వీర్రాజు!