Friday, April 26, 2024
- Advertisement -

‘నన్ను నమ్ముకున్నారా? అమ్ముకున్నారా అక్కా?’……. గౌరు దంపతులతో జగన్ ఆవేదన

- Advertisement -

గౌరు సుచరితారెడ్డికి వైఎస్ రాజశేఖరరెడ్డి ఏ స్థాయిలో అండగా నిలిచారో అందరికీ తెలిసిన విషయమే. అయితే గౌరు దంపతులు మాత్రం ఆశ్రయమిచ్చినవారికే వెన్నుపోటు పొడిచే రాజకీయాలు చేశారు. అన్నీ తెలుసుకున్న జగన్ ఆ దంపతుల ఎదురుగానే ఆవేదన వ్యక్తం చేశారు. నిన్నే నమ్ముకున్నాం అని చివరి దశలో కూడా కల్లబొల్లి కబుర్లు చెప్పి జగన్‌ని నమ్మించడానికి ప్రయత్నం చేసిన గౌరు దంపతులకు వాళ్ళ వ్యవహారాలన్నింటినీ సాక్ష్యాలతో సహా వాళ్ళకే చూపించాడు విజయసాయిరెడ్డి. ఆ తర్వాత వాళ్ళ నోట మాట రాకుండా పోయింది. ‘నన్ను నమ్ముకున్నారా? అమ్ముకున్నారా’ అని చెప్పి ఆవేదన వ్యక్తం చేసిన జగన్…….వెన్నుపోటు రాజకీయాలకు వైకాపాలో స్థానం లేదని, విలువలు, నిజాయితీ లేని రాజకీయాలు వైఎస్‌లకు సరిపడవని తేల్చిచెప్పారు. గౌరు దంపతులతో వైఎస్ జగన్ చివరి సమావేశంలో ఏం జరిగిందో అందరికీ తెలిశాక ఇప్పుడు గౌర దంపతులు కొత్త కొత్త రాగాలు తీస్తూ అబద్ధపు రాజకీయం చేస్తున్నారు.

గౌరు దంపతుల వెన్నుపోటు రాజకీయం ఏంటంటే…..?
MLC గా శిల్పా చక్రపాణి రెడ్డి రాజీనామాతో వచ్చిన ఖాళీ కి పోటీ చెయ్యమని చెప్పారు. కొద్దిపాటి తేడా తో మాత్రమే 2017 లో చక్రపాణి గెలిచారు. శిల్పా సోదరులు ఇటు రావడంతో నంద్యాల & శ్రీశైలం నియోజికవర్గాలలో దాదాపు 50 వోట్లు వచ్చాయి. దానితో గెలుపుకు అవకాశం ఉంది. అయినా … పోటీ కి సిద్దపడలేదు.

దీనికి కారణం చంద్రబాబు వేసిన పాచిక లో వీళ్ళు బోల్తా పడటం . గౌరు బావ అయిన శివానంద రెడ్డి కి MLC అని ముందుగా ప్రచారం చేయించారు. బావతో పోటీ చేయలేను అని ఒకసారి… ఇంకోసారి చేస్తా అని చెప్పి………అలా చివరి వరకూ నాంచుతూ చివరగా చేతులెత్తేసి టిడిపి గెలుపుకు సాయపడ్డారు. అవకాశం చూసి చంద్రబాబు KE ప్రభాకర్ కి ఆ MLC ఇచ్చారు.

2016 నుండి 2017 మధ్యలో 2 సార్లు పార్టీ మారాలి అని చూశారు. మంత్రి పదవి హామీ లేకపోవడం వలన మారలేదు. ఈ విషయాలన్నీ టిడిపి మీడియాలోనే సాక్ష్యాలతో సహా వచ్చాయి. అయినప్పటికీ గౌరు దంపతులు ఎప్పుడూ కూడా ఆయా విషయాలను ఖండించలేదు.

ఇప్పుడు కూడా కేవలం వాళ్ళ బావ శివానంద రెడ్డి కి MP టికెట్ ఇస్తాం… మీరు రండి.. మీకు పాణ్యం ఇస్తా అన్న బేరం మీదే వెళ్లారు. పాణ్యం గురించి జగన్ ఇప్పటి వరకు ఎక్కడా టికెట్ ఇవ్వను అని గాని ఇస్తా అని గాని చెప్పలేదు. ముందుగానే టిడిపిలో టికెట్ కన్ఫాం చేసుకుని పార్టీ వీడడానికి రెడీ అయిన గౌరు దంపతులు చివరి నిమిషంలో కూడా నిన్నే నమ్ముకున్నాం అంటూ జగన్ ముందు కబుర్లు చెప్పారు. అయితే జగన్ మాత్రం ‘నన్ను నమ్ముకున్నారా? అమ్ముకున్నారా అక్కా’ అంటూ సూటిగా ప్రశ్నించడంతో గౌరు దంపతుల నుంచి నోట మాట రాలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -