రాష్ట్రంలోని రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు పోలింగ్ సమయం ముగిసింది. క్యూలో ఉన్నవారికి అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు. హైదరాబాద్-రంగారెడ్డి- మహబూబ్నగర్తోపాటు నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల స్థానానికి… పోలింగ్ జరిగింది.
21 జిల్లాలు, 77 శాసనసభ నియోజకవర్గాల్లో ఏర్పాటుచేసిన 1,530 కేంద్రాల్లో పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ స్థానానికి 93 మంది అభ్యర్థులు బరిలో ఉండగా… నల్గొండ-ఖమ్మం-వరంగల్ స్థానానికి 71 మంది పోటీపడ్డారు.
ప్రజాస్వామ్యంలో కీలకమైన ఓటుహక్కు వినియోగించుకోవాలన్న తమ విజ్ఞప్తికి స్పందించిన ప్రతి ఒక్క విద్యావంతునికి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. పార్టీ యంత్రాంగం మొత్తం గత రెండు వారాలుగా ఎన్నికల్లో విజయం కోసం కృషి చేసిందని… పార్టీ ప్రయత్నాలకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని కేటీఆర్ అన్నారు.
సన్యాసిగా ఎంఎస్ ధోని.. షాక్ లో అభిమానులు!
