గత కొన్నిరోజులుగా బంగారం ధర అనూహ్యంగా మార్పు చెందుతూ వచ్చింది. కేంద్ర బడ్జెట్ తర్వాత బంగారం ధర తగ్గు ముఖం పడుతూ వచ్చింది. తాజాగా మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. పసిడి ధరలు పెరగగా వెండి సైతం బంగారం బాటలోనే పయనిస్తోంది. కనిష్ట ధరలు నమోదు చేసిన బంగారం ధర తాజాగా పుంజుకుంటోంది.
పెరిగిన ధరల ప్రకారం ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 150 పెరిగి రూ. 42,000 కి చేరింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.170 పెరిగి రూ.45,820 కి చేరింది. బంగారం బాటలోనే వెండి ధరలు కూడా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగింది.
తాజాగా రూ.160 మేర బంగారం ధర పెరగడంతో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,160 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,150కి చేరింది. ఇక 1కేజీ వెండి ధర రూ.700 పెరిగి రూ.71,400 వద్ద ఉంది.
ఆ రెండు సీట్ల కోసం పోటీ..4 గంటల వరకు పోలింగ్..!