Tuesday, May 7, 2024
- Advertisement -

ఏపీలో ఖ‌రార‌యిన ప్ర‌ధాని మోదీ, అమీత్ షా టూర్‌…

- Advertisement -

ఏపీలో ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌టంతొ భాజాపా కూడా దూకుడు పెంచింది. ఇప్ప‌టికే టీడీపీ, భాజాపాల మ‌ధ్య విభ‌జ‌న హామీల విష‌యంలో ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటోంది. తాజాగా ప్ర‌ధాని మోదీ, అమిత్ షా ఏపీ ప‌ర్య‌ట‌న ఖ‌రార‌య్యింది. పిబ్రవరి 10న గుంటూరు, 16న విశాఖలో ప్రధాని మోడీ పర్యటించనున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ తెలిపారు. మరోవైపు ఫిబ్రవరి 4న అమిత్ షా విజయనగరంలో బస్సు యాత్రను ప్రారంభించ‌నున్నారు.

అనంత‌రం 21న రాజమండ్రిలో క్లస్టర్ మీటింగ్, 25న పార్లమెంట్ నియోజకవర్గ శక్తి కేంద్రాలతో సమావేశం, 26న ఒంగోలులో జరిగే కార్యక్రమాల్లో అమిత్ షా పాల్గొంటారని తెలిపారు. బాబుపై కూడా విమ‌ర్శ‌లు గుప్పించారు. చంద్రబాబు అవినీతి తట్టుకోలేక కియో మోటర్స్ ఏపీ నుంచి వెళ్ళిపోయేవారు. మోడీ ఎంటరయ్యారు కాబట్టే ఏపీకి కియో మోటర్స్ వచ్చిందన్నారు. కియో మోటర్స్ వలన వేలాది మందికి ఉద్యోగాలు కేంద్రం చొర‌వ‌తోనే వ‌చ్చాయ‌న్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -