- Advertisement -
కర్ణాటక సీఎం కుమారస్వామిపై ప్రధాని నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కుమారస్వామిని ఒక్లర్క్తో పోల్చి ఎద్దేవ చేశారు. కర్నాటకలో కాంగ్రెస్-జేడీఎస్ ఆధ్వర్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఆయనపై కాంగ్రెస్ నేతలు ఒత్తిడి తీసుకొస్తుండటంతో ఆయన క్లర్క్గా మారారని సెటైర్లు వేశారు. శనివారం రామ్లీలా మైదానంలో జరిగిన బీజేపీ కార్యవర్గ సమావేశంలో మోదీ ఈవ్యాఖ్యలు చేశారు.
మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఫైర్ అయ్యారు. అన్యోన్యంగా ఉండే తమలో చిచ్చు పెట్టేందుకు ప్రధాని కుట్ర పన్నుతున్నారన్నాసమన్వయ కమిటీ చైర్మన్, మాజీ సీఎం సిద్దరామయ్య నిప్పులు చెరిగారు. జేడీఎస్ నేతలు కాంగ్రెస్పై వ్యతిరేకత పెంచుకునేలా ప్రధాని వ్యూహం పన్నారన్నారని ఆరోపనలు చేశారు.