వలసలతో వైసీపీ పార్టీ టాప్ గేర్లో వెల్తోంది. ఎన్నికల నోటిఫికేష్న్ వచ్చిన నేపధ్యంలో వైసీపీలోకి భారీగా వలసలు కకొనసాగతున్నాయి. రజాకీయ పార్టీనుంచే కాకుండా అన్ని వర్గాలనుంచి పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. త్వరలో జగన్ అభ్యర్తుల జాబితా ప్రకటించనున్ననేపధ్యంలో ముందుగాలనే పార్టీలో చేరుతున్నారు. ఏపీలో ప్రతిపక్ష పార్టీ వైసీపీకి మాత్రం సినీ ఇండస్ట్రీ నుంచి మద్దతు పెరుగుతోంది. వైసీపీలో చేరే సినీ నటుల సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటికే అలీ, పృథ్వి, కృష్ణుడు, భానుచందర్, జయసుధ వంటి నటులు వైసీపీ తీర్ధం పుచ్చుకున్న విషయం తెలిసిందే. తాజాగా సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు వైసీపీ కండువా కప్పుకోనున్నారు.
ప్రముఖ పారిశ్రామిక వేత్త, సీన నిర్మాత పొట్లూరి వరప్రసాద్. సీనీ నటుడు రాజారవీంద్ర ఈరోజు జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. లోటస్ పాండ్లోని వైసీపీ కార్యాలయంలో జగన్ పార్టీ కండువా కప్పు పార్టీలోకి సాదనంగా ఆహ్వానించారు. జగన్ ఏ పని ఇచ్చినా చేసేందుకు సిద్ధమని అన్నారు. విజయవాడ ప్రాంతంలో రాజధాని లేని సమయంలోనే తానెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశానని చెప్పారు. తనకు అవకాశం ఇస్తే, మరింత అభివృద్ధిని చూపిస్తానని వరస్రసాద్అన్నారు.
నటుడు రాజీరవీంద్ర మాట్లాడుతూ ఎలాంటి పదవులు ఆశించి పార్టీలో చేరలేదన్నారు. ఈ సారి ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందని జగనే ముఖ్యమంత్రి అని రాజారవీంద్ర అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ తరుపున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తానని వెల్లడించారు.