Thursday, April 25, 2024
- Advertisement -

కేసిఆర్ కి షాక్ ఇచ్చిన రఘుమారెడ్డి..!

- Advertisement -

టి.ఆర్.ఎస్ పాలనకు వ్యతిరేకంగా మార్చి 7న తెలంగాణ ఉద్యమకారుల సింహ గర్జన మహాసభను హైదరాబాద్​లో నిర్వహిస్తున్నట్లు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు రఘుమారెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 50 వేల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇచ్చాకే ఓట్లు అడగాలని ఆయన డిమాండ్ చేశారు. హైదర్​గూడలో ఐక్యవేదిక ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అధికార టి.ఆర్.ఎస్ అభ్యర్థులు తక్షణమే వారి నామినేషన్లు ఉపసంహరించుకోవాలని తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. ప్రచారం నిర్వహిస్తే వారిని అడ్డుకుంటామని.. అనంతరం జరిగే పరిణామాలకు సీఎం పూర్తి బాధ్యత వహించాలని రఘుమారెడ్డి హెచ్చరించారు.

రాష్ట్రంలోని 40 లక్షల మంది నిరుద్యోగుల సాక్షిగా మహాసభను నిర్వహిస్తామన్నారు. మరోసారి నిరుద్యోగులను, ఉద్యమకారులను మోసం చేస్తున్న టి.ఆర్.ఎస్ కి బుద్ధి చెప్పాలని ఓటర్లకు ఐక్యవేదిక నాయకులు విజ్ఞప్తి చేశారు.

ఫోటో ఫీచర్ : ఈ ఫోటోలో ఉన్న చిన్నారి ఎవరో తెలుసా?

సిరియాపై అమెరికా వైమానిక దాడి… బైడెన్ తొలి సైనిక చర్య..!

దేశంలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -