సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది వైసీపీ బలం పుంచుకోంటోంది. పాదయాత్ర ప్రభావంతో పార్టీలోకి వసలు షురూ అవుతున్నాయి. టీడీపీనుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్యాన్ కిందకు చేరుతున్నారు. టీడీపీ అధిష్టానం ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారు. కడపలో జగన్ ఆధిపత్యాన్ని నిలువరించాలని బాబు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడంలేదు. జగన్కు చెక్ పెట్టేందుకు శత్రువులందర్నీ పార్టీలోకి చేర్చుకుంటుంటే…మరో వైపు పార్టీనుంచి ముఖ్యనేతలు బయటకు వెల్తున్నారు.
ఇప్పుడు కడపజిల్లా రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే మేడా మళ్లిఖార్జున్ రెడ్డి వైఎస్ జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఈరోజు సోదరులు రఘునాథ రెడ్డి, సుధాకర్ రెడ్డితో కలిసి హైదరాబాద్ లోని జగన్ నివాసానికి మేడా చేరుకున్నారు. వీరికి జగన్ కండువా కప్పి, పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
బాబు విధానాలు నచ్చక పోవడంతోపాటు…. పార్టీలో తగిన ప్రాధాన్యత ఇవ్వడంలేదని కొద్దిరోజుల క్రితం మేడా బాబుపై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. పార్టీలో చేరేముందుగానే ఎమ్మెల్యే, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దాదాపు 300 వాహనాల్లో 4,000 మంది అనుచరులతో కలిసి మేడా జగన్ నివాసానికి చేరుకున్నారు. దీంతో ఈ మార్గంలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. జగన్ సమక్షంలో మేడా బ్రదర్స్తోపాటు అనుచరులు పార్టీలో చేరారు.