Sunday, May 19, 2024
- Advertisement -

ప్ర‌చారంలో ఉన్న జ‌గ‌న్‌తో ట‌చ్‌లో ఉన్న నేత‌…..

- Advertisement -

నంద్యాల టీడీపీలో ఉన్న స‌మ‌స్య‌ల‌తో బాబు ఇబ్బందులు ప‌డుతుంటె ఇప్పుడు తాజాగా కొత్త గొడ‌వ‌లు మొద‌ల‌య్యాయి. ఈ గొడ‌వ‌లు చివ‌రికి చిలికి చిలికి గాలివాన‌లా మారి నేత‌లు వైసీపీవైపు చూస్తున్నారు. స్థానికి నేత‌ల అభిప్రాయాలను తెలుసుకోకుండా ఇత‌రుల‌ను పార్టీలోకి చేర్చుకోవ‌డంతో అక్క‌డి నాయ‌కుల‌కు రుచించ‌డంలేదు.

ఇప్పుడు తాజాగా మంచి ప‌ట్టున్న ఆపార్టీనేత జ‌గ‌న్‌తో ట‌చ్‌లో ఉన్నార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. జ‌గ‌న్ కూడా నంద్యాలో ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఉన్నాడు. నేష‌న‌ల్ కాలేజీ అధినేత ఇంతియాజ్ అహ్మ‌ద్‌ను టీడీపీలో చేర్చుకోవ‌డంపై కొంద‌రు నేత‌లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు . క‌నీసం త‌న‌ను సంప్ర‌దించకుండా పార్టీలో తీసుకోవ‌డంపై రామ‌కృష్ణ విద్యాసంస్థ‌ల అధినేత రామ‌కృష్ణారెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నార‌ని తెలుస్తోంది. దీంతో ఆయ‌న బుధ‌వారం ప్ర‌చారానికి దూరంగా ఉన్నారు.

ఇంతియాజ్‌తో మొదటి నుంచి ఈయ‌న‌కు ప‌డ‌దు. దీంతో రామ‌కృష్ణారెడ్డిని బుజ్జ‌గించేందుకు మంత్రి అఖిల‌ప్రియ ప్ర‌యత్నించారు. అయితే ఆయ‌న స‌సేమిరా అన్న‌ట్లు తెలుస్తోంది. దీంతో ఏవీ సుబ్బారెడ్డిని రంగంలోకి దింపేందుకు పార్టీ ప్ర‌య‌త్నించిన‌ట్లు తెలుస్తోంది. అయితే ఆయ‌న రాయ‌బారానికి వెళ్లేందుకు ఇష్ట‌ప‌డలేదు.

ప్ర‌ధానంగా స్థానిక నేత‌ల‌ను ప‌క్క‌న‌పెట్టి ….ఇప్పుడు పార్టీలోకి వ‌చ్చిన వారికి ప్రాధాన్య‌త ఇవ్వ‌డంతో అసంతృప్తితో ర‌గిలిపోతున్నారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఉన్న జ‌గ‌న్‌తో సంప్రదింపులు జ‌రిపి …వైసీపీ తీర్థం పుచ్చుకోవాల‌నె ప‌నిలో నేత‌లు ఉన్నట్లు స‌మాచారం. స్థానికంగా ప‌ట్టున్న శిల్పా బ్ర‌ద‌ర్స్ దూర‌మ‌వ‌డంతో కోలుకోలేని దెబ్బ ప‌డిన టీడీపీ ఇప్పుడు రామ‌కృష్ణారెడ్డి అల‌క‌తో క‌కావిక‌లం అవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -