ఉత్కంఠ భరితంగా సాగిన దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు ఎలాంటి ట్రెండ్ సృష్టించాయో అందరికీ తెలిసిందే. మొదటి రౌండ్ నుంచి బీజేపీ లీడింగ్ కొనసాగిస్తూ వచ్చింది. అయితే మధ్యలో తెరాస పార్టీ పుంజుకోవడంతో పాటుగా లీడింగ్ లోకి కూడా వచ్చింది. కానీ, 20 వ రౌండ్ నుంచి ఫలితం మారిపోయింది. 20, 21, 22, 23 మిగతా రౌండ్ లలో బీజేపీ లీడింగ్ సాధించడంతో విజయం సాధించింది. ఈ ఉప ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తామనుకున్న అధికార టీఆర్ఎస్ పార్టీకి చెమటలు పట్టించి మరీ బీజేపీ విజయం సాధించింది.
తమ ఓటమికి చపాతి రోలర్ గుర్తు కారణమని టీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. కారును పోలిన గుర్తును స్వతంత్ర అభ్యర్థికి చపాతీ రోలర్ ని కేటాయించారు. ఈ గుర్తే టీఆర్ఎస్ కొంప ముచ్చిందని సొంత పార్టీ నాయకులు అనుకుంటున్నారు. అయితే..చపాతీ రోలర్ అచ్చం కారు లాగే ఉండటం విశేషం. ఈ ఎన్నికలో కారును పోలిన గుర్తు చపాతీ రోలర్ కు 3489 ఓట్లు వచ్చాయి . అలాగే ..నోటాకు నోటా కు 552 ఓట్లు పోల్ అయ్యాయి .
చపాతీ రోలర్ ఓట్లు టీఆర్ఎస్ కు వచ్చేయని …దుబ్బాక ప్రజలు కారు గుర్తు అనుకుని చపాతీ రోలర్ కు వేసారని టీఆర్ఎస్ నాయకులు వాపోతున్నారు . ఏది ఏమైనా చివరికి దుబ్బాకలో బీజేపీ జెండా ఎగురవేసింది. ఏది ఏమైనా చివరికి దుబ్బాకలో బీజేపీ జెండా ఎగురవేసింది.
దుబ్బాకలో ఓటమికి పూర్తి బాధ్యత వహిస్తున్న : మంత్రి హరీష్
చంద్రబాబు చెప్పేది మరీ చోద్యంగా ఉంది..?