మాజీ ఐఏఎస్ లక్ష్మీనారాయణను సీఐడీ అధికారులు ఎందుకు నోటీసులు జారీ చేశారు.. చంద్రబాబు హయాంలో ఐఏఎస్గా విధులు నిర్వర్తించిన లక్ష్మీనారాయణ ఎవరికైనా భినామా…? లక్ష్మీనారాయణ వెనుక ఉన్న రాజకీయ నాయకులు ఎవ్వరు..? ఓ మాజీ మంత్రి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ఇరుక్కో బోతున్నారా..? ఇదే ఇప్పుడు చర్చనీయంశంగా మారింది.
మాజీ ఐఏఎస్ అధికారి ఇంట్లో సీఐడీ అధికారులు ఎందుకు సోదాలు చేశారు. ఎందుకు పలువురి టీడీపీ కీలక నేతల గుండెల్లో గుభులు మొదలైంది. అదేంటి మాజీ ప్రభుత్వ అధికారి కి పై సీఐడీ దాడులు జరిగితే టీడీపీ నేతలకు భయం ఎందుకు..? ఈ అవినీతి ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రికి సన్నిహితం ఉందా..? ఈ కుభంకోణంలో అప్పటి ముఖ్యమంత్రి తనయుడు ప్రమేయం ఉందా..? అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
దీని కోసమే ఐటీ దాడులు జరుగుతున్న సమయంలో వాటిని ఆపేందుకు ABN రాధాకృష్ణ, టీడీపీ నేత పయ్యావుల కేశవ్ ఇతర టీడీపీ నేతలు లక్ష్మీనారాయణ ఇంటికి వెళ్లినట్లు. ఐటీ దాడులు జరుగుతున్న సమయంలో ఇలా వెళ్లడం వెనుక పెద్ద తలకాయలు ఈ స్కామ్లో ఉన్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ స్కామ్లో తమ నేతల పేర్లు బయటకు రాకుండా చూశాడనే టాక్ వినిపిస్తుంది. ఈ స్కామ్లో ఒక వేళా లోకేశ్ పేరు భయట పడుతే దాదాపు చంద్రబాబు నాయుడు సైతం దొరికినట్లే అవుతోంది. దీంతో చంద్రబాబుకు ఈ ఎన్నికలే చివరివి అని చెప్పవచ్చు. మరి ఈ కుంభకోణంలో ఎంత మంది టీడీపీ నాయకులు ఉన్నారు, అవినీతి మంత్రులు ఎవ్వరైనా ఉన్నారా అనేది ఇక సీఐడీ అధికారులే తేల్చాలి.
అధికారంలో ఉన్నప్పుడు ఏం పీకారు!