Friday, April 19, 2024
- Advertisement -

అధికారంలో ఉన్నప్పుడు ఏం పీకారు!

- Advertisement -

చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏదో ఒక వంకతో మీడియా ముందుకు వస్తున్న బాబూ పదే పదే జగన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. అధికారంలోకి వచ్చాక రాజధానిని అద్భుతంగా నిర్మిస్తామని, పోలవరం డ్యామ్‌ను త్వరితగతిన పూర్తి చేస్తామన్న జగన్‌ ఇప్పుడు ఏం చేస్తున్నారని మండి పడుతున్నారు.

మరోవైపు వైసీపీ నేతలు చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2014 ఎన్నికల ముందు కొత్త రాష్ట్రానికి అనుభవమున్న సీఎం కావాలని, తనను సీఎం చేస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదాను తీసుకురావడంతో పాటు రాష్ట్ర రాజధానిని అద్భుతంగా నిర్మిస్తానని బాబు అన్నట్లు గుర్తు చేశారు. రాజధాని, పోలవరం రెండు కళ్లు అంటున్న చంద్రబాబు అప్పుడు ఏం పీకారు… అన్ని తనే చేసి ఇప్పుడు ప్రత్యేక హోదా పై ముసలి కన్నీరు పెడుతున్నారు అంటూ గట్టిగా విమర్శిస్తున్నారు.

ఎన్నికల అనంతరం బీజేపీ భజన చేసిన చంద్రబాబు.. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని విమర్శించారు. బీజేపీతో జతకట్టిన బాబు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇస్తానన్నా వద్దాన్నారనే ప్రచారం జరుగుతోంది. తీరా విషయం ప్రజలకు తెలియడంతో దొంగ నాటకం మొదలు పెట్టి దీక్షలు చేశారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు జగన్‌ను అంటున్న చంద్రబాబు… తాను అధికారంలో ఉన్నప్పుడు ఏం పీకారో చెప్పాలని ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. పోలరానికి జాతీయ్య హోదా తెస్తానన్న బాబు ప్యాకేజీ కూడా తీసుకురాలేకపోయారని విమర్శించారు.

రాజధానిని నిర్మించడానికి ప్రజల నుంచి భిమానీల పేర్లపై భూములు రిజిస్ట్రేషన్ చేసుకొని అక్కడ అభివృద్ధి అంటూ గ్రాఫిక్స్ డిజైన్‌ను రాష్ట్ర ప్రజలకు చూపించారన్నారు. చంద్రబాబు మాటలు నమ్మని ఏపీ ప్రజలు ఎన్నికల్లో బాబుకు తగిన బుద్ది చెప్పారన్నారు.

జనసేనాని దీక్ష వెనుక అసలు కథ ఇదా…?

మాజీ ఐఏఎస్‌ ఇంట్లో సాధాలు… రాధాకృష్ణకు అక్కడేంపని..?

భరువు తగ్గనున్నా గ్యాస్ సిలిండర్‌.. కేంద్రం మరో కీలక నిర్ణయం..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -