Wednesday, April 24, 2024
- Advertisement -

ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు.. మధ్యలో జలఫిరంగులు..!

- Advertisement -

వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ.. కేరళలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు పినరయి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే.. గవర్నర్​ ఆరిఫ్​ మహమ్మద్​ ఖాన్​ అందుకు తిరస్కరించారు. ప్రత్యేక సమావేశాలకు అంత అత్యవసరం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వం వివరణ సరిగా లేదని అన్నారు.

రైతులకు సంఘీభావంగా బుధవారం ఒక రోజు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి, కేంద్ర చట్టాలకు వ్యతిరేక తీర్మానం చేయాలని సీపీఎం నేతృత్వంలోని ఎల్​డీఎఫ్​ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే సీఎం నిర్ణయాన్ని గవర్నర్​ తోసిపుచ్చారు. అయితే.. గవర్నర్​ నిర్ణయం విచారకరమని ముఖ్యమంత్రి ఆరోపించారు.

గవర్నర్​ నిర్ణయాన్ని నిరసిస్తూ రాజ్​భవన్​ ముట్టడికి యత్నించారు కాంగ్రెస్​ కార్యకర్తలు. అయితే.. అప్రమత్తమైన పోలీసులు జలఫిరంగులు ప్రయోగించి వారిని చెదరగొట్టారు. అక్కడే బైఠాయించిన కాంగ్రెస్​ నేతలు.. గవర్నర్​కు వ్యతిరేకంగా నినదించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -