సూపర్ స్టార్ రజనీ కాంత్ తన అభిమాన సంఘం జిల్లా కార్యదర్శులతో సోమవారం సమావేశం కానున్నారు. ఉదయం 10 గంటలకు చెన్నైలోని రాఘవేంద్ర కల్యాణ మండపంలో ఈ భేటీ జరగనున్నట్లు ‘రజనీ మక్కల్ మంద్రమ్’ వర్గాలు ధ్రువీకరించాయి. దాదాపు 50 మంది నాయకులు ఈ సమావేశానికి హాజరుకానున్నట్లు సమాచారం.
రజనీ రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్న వారిలో ఒకరైన తుగ్లక్ పత్రిక సంపాదకులు గురుమూర్తితో వారం కిందట అమిత్ షా సమావేశం అయ్యారు. ఈ నేపథ్యంలో తమిళనాట రాజకీయాలు చకచకా మారిపోతున్నట్లు కనిపిస్తున్నాయి.
ఇప్పటివరకు స్తబ్దుగా ఉన్న తమిళ బీజేపి నాయకులు కూడా రజనీతో కలిసి పని చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. సూపర్స్టార్ మద్దుతు కూడగట్టే దిశగా అమిత్ షాకు సూచనలు ఇస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాట బీజేపి జెండా పాతాలని చూస్తోంది.
మహేష్ బాబుకు ఇష్టమైన హీరో ఎవరో తెలుసా ?
ఒక్క రోజు షూటింగ్ చేస్తే రమ్యకృష్ణకు ఎంత ఇస్తారో తెలుసా ?