టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మరోసారి నోటి దురుసు ప్రదర్శించారు. తనను అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులపై బెదిరింపులకు దిగారు. టీడీపీ అధికారంలోకి వస్తే తానే హోం మంత్రి అవుతానని, అప్పుడు అందరి సంగతి తేలుస్తా అంటూ వీరంగం వేశారు. తనను ఆపే హక్కు వాళ్లకు లేదని, పనికిరాని వాళ్లు అంటూ పోలీసులను కించపరిచారు. నిమ్మాడలో వైఎస్సార్ సీపీ మద్దతుదారు, సర్పంచ్ పదవికి పోటీ పడుతున్న అప్పన్నపై అచ్చెన్న వర్గం దాడికి దిగిన విషయం తెలిసిందే.
దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మంగళవారం అచ్చెన్నను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీకు శిక్షణ ఎవరు ఇచ్చారు, నేను హోం మినిస్టర్ అయిన తర్వాత మీ అంతు చూస్తా అంటూ చిందులు తొక్కారు. తప్పు చేసి, దానిని సమర్థించుకుంటున్న అచ్చెన్నాయుడు తీరుపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి.
23 సీట్లున్న టీడీపీకి ప్రజలు వచ్చే ఎన్నికల్లో అంతకంటే తక్కువ సీట్లే ఇస్తారు. అయినా కూడా మీ అజ్ఞాన చక్రవర్తి, పప్పు లోకేశ్ సీఎం అవుతాడు. నువ్వు హోం మంత్రివి. మీ మద్దతుదారు.. పవన్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ చూసుకుంటాడు.. అందరూ ఒక్కో పదవి పంచుకోండి అని సెటైర్లు వేస్తున్నారు. అంతేగాకుండా.. ఇన్ని అరాచకాలు చేసిన నువ్వు ఇలా జైలుకు వెళ్లడం ఏందయ్యా అంటూ మీమ్్స షేర్ చేస్తున్నారు.
కాగా నిమ్మాడలో గత కొన్నేళ్లుగా అచ్చెన్న ఆగడాలు కొనసాగుతున్న విషయం బహిరంగ రహస్యమే. తనకు అడ్డు వచ్చిన వారిని మాయం చేసైనా సరే పంతం నెగ్గించుకోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు పదవి వస్తే రక్తపాతం స్రుష్టిస్తారని ఆందోళనకు గురవుతున్నారు.
మొదటి సారిగా మెట్రోలో గుండె తరలింపు!
బాబు కళ్లు తేలేస్తున్నాడు.. నిమ్మగడ్డ పచ్చనేత స్క్రిప్టు చదువుతున్నాడు