Saturday, April 27, 2024
- Advertisement -

బాబు క‌ళ్లు తేలేస్తున్నాడు.. నిమ్మ‌గ‌డ్డ ప‌చ్చ‌నేత‌ స్క్రిప్టు చ‌దువుతున్నాడు

- Advertisement -

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు వ్య‌వ‌హార‌శైలిపై వైఎస్సార్ సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, రాజ్య‌స‌భ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ఫైర్ అయ్యారు. పంచాయ‌తీ ఎన్నిక‌ల వేళ ఆయ‌న స‌ల‌హాల‌తో రెచ్చిపోతున్న‌ ప‌చ్చ నేత‌ల బ‌రితెగింపుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. టీడీపీకి మ‌ద్ద‌తుగా అభ్య‌ర్థులు ముందుకు రాక‌పోవ‌డంతో ఫ్ర‌స్ట్రేష‌న్‌లో మునిగిపోయి, రాజకీయ ప్ర‌త్య‌ర్థుల‌పై దాడుల‌కు దిగుతూ కుట్ర‌లు చేసిన వాళ్లు, ఇప్పుడు త‌మ మీద తామే దాడులు చేయించుకుని సానుభూతి పొందే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని విజ‌య‌సాయిరెడ్డి మండిప‌డ్డారు.

” పంచాయతీ ఎన్నికలు పెట్టాల్సిందేనని రంకెలేసిన చంద్రబాబు ఇప్పుడు అభ్యర్థులు దొరక్క కళ్లు తేలేస్తున్నాడు. ఈ పరాభవం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు తన పార్టీ నాయకుల మీద తనే దాడులు చేయించే కుట్రలు మొదలుపెట్టాడు. గుళ్లను కూల్చినోడికి ఇంతకు మించిన ఆలోచనలెలా వస్తాయి? అని ట్విట‌ర్ వేదిక‌గా చంద్ర‌బాబు తీరును విమ‌ర్శించారు.

అదే విధంగా ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్‌కుమార్‌ను ఉద్దేశించి.. “అధిక‌ ప్రసంగాలు తప్ప అసలు పని చెయ్యడు. పచ్చ నేతలను మించి మాట్లాడుతున్నాడు. నీ బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలకు బెదిరేవారు లేరు. సజావుగా ఎన్నికలు జరుగుతుంటే ఇప్పుడు ఆన్‌లైన్‌ అంటూ పుల్లలు పెడుతున్నాడు. పచ్చ నేత రాసిచ్చిన స్క్రిప్ట్‌నే చదువుతున్నాడు నిమ్మగడ్డ అని విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

ఇదే అవకాశం.. చిచ్చు పెట్టండి.. పార్టీ శ్రేణులకు చంద్రబాబు ఆదేశాలు?

సొంత జిల్లాలో చంద్ర‌బాబుకు చేదు అనుభ‌వం!

ఆదిపురుష్ సెట్ లో అగ్నిప్రమాదం..దిష్టి పోయిందన్న మంచు హీరో

ఐపీఎల్ చరిత్రలో ధోని ఆర్జించిన మొత్తం ఎంతో తెలుసా!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -