మంత్రి భూమా అఖిలప్రియకు మరో షాక్ తగలనుంది. భూమా నాగిరెడ్డికి కుడి బుజంగా ఉన్న ఏవీ సుబ్బారెడ్డి పార్టీమారేందుకు సిద్దంగా ఉన్నట్లు సమాచారం. నాగిరెడ్డి మరణించిన తర్వాత అఖిలప్రియ మంత్రి పదవిని చేపట్టారు. అప్పటినుంచి ఇద్దరి మధ్య విబేధాలు బగ్గు మంటూనే ఉన్నాయి.
నంద్యాల ఉప ఎన్నిక సమయంలో తనకు ఆ సీటు కావాలని, టిడిపి అధిష్టానంపై, ‘భూమా’ కుటుంబ సభ్యులపై ఒత్తిడి తెచ్చారు. అయితే అప్పట్లో టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ఆయనను బుజ్జగించి..మౌనం వహించేలా చేశారు. అయితే తాజాగా నూతన సంత్సరం ఇద్దరి మధ్య విబేధాలు తెచ్చిపెట్టింది.
నంద్యాల ఉప ఎన్నికతర్వాత ‘నాగిరెడ్డి’ కుటుంబ సభ్యుల మధ్య..’సుబ్బారెడ్డి’ల మధ్య దూరం మరింత పెరిగిపోయింది. దీంతో..’సుబ్బారెడ్డి’ ‘నాగిరెడ్డి’ ఇంటి వైపుకు కూడా వెళ్లడం లేదు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో నంద్యాలనుంచి పోటీ చేసేందుకు సుబ్బారెడ్డి తన ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
దీనిలో భాగంగానే నూతన సంవత్సర వేడుకల్లో ఆయన హంగామా సృష్టించారు. నిన్న తన అనుచరులు…మీడియా వర్గాలకు, ఇతరులకు భారీ ఎత్తున్న విందు, వినోద కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దాదాపు ఐదువేల మంది పాల్గొన్నట్లు అక్కడికి వెళ్లిన వారు చెబుతున్నారు. ఏపార్టీలో చేరేది చెప్పకపోయినా టిడిపి టిక్కెట్ దక్కపోతే..ఆయన వైకాపా నుంచైనా బరిలో ఉంటానని స్పష్టంగా చెబుతున్నారట.
ఒక వేళ వైకాపా కూడా టిక్కెట్ ఇవ్వకపోతే…తాను ఆ పార్టీకి మద్దతుదారుగా ఉండి…భూమానాగిరెడ్డి కుటుంబాన్ని దెబ్బతీస్తానని స్పష్టం చేస్తున్నారట. మంత్రి అఖిలప్రియ వ్యవహారశైలి నచ్చకే ‘సుబ్బారెడ్డి’ ఈ విధంగా వ్యవహరిస్తున్నారని స్థానిక టిడిపి నాయకులు చెబుతున్నారు. చూడాలి చివరకు ఏమి జరుగుతుందో…?