వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోమన్రెడ్డిపై మంత్రి నారాలోకేష్ నిప్పులు చెరిగారు. టీడీపీ… తిరుపతిలో ఏర్పాటు చేసిన ధర్మ దీక్షలో లోకేష్ మాటల తూటాలు పేల్చారు. జగన్ 12 కేసుల్లో ఏ1 ముద్దాయిగా ఉన్నారని ఆయనొక 420 అని విమర్శలు గుప్పించారు. ప్రతి శుక్రవారం జగన్ చేతులు కట్టుకుని కోర్టులో నించుంటాడని, మీకు ఆయన గొప్ప నాయకుడిగా అనిపిస్తే ఆయనతో పొత్తు పెట్టుకోండని బీజేపీని విమర్శించారు.
నాపై ఆరోపణలు చేసేముందు నేనెక్కడ, ఎలా, ఎలాంటి తప్పు చేశానో ఆధారాలతో ప్రజలముందు పెట్టండి కానీ.. అర్థంపర్థంలేని ఆరోపణలు చేయొద్దు. నా వయస్సు 34. ఇంకా 40 ఏళ్లు రాజకీయాల్లో ఉండాలనే కోరిక ఉంది. తాతలాగో, నాన్నగారిలాగో మంచి పేరు వస్తుందో, రాదో నాకు తెలీదుగానీ.. వాళ్లకు చెడ్డపేరు మాత్రం తీసుకురానని తెలిపారు.
2019లో తెదేపా మళ్లీ భారీ మెజార్టీతో గెలవడం తథ్యం. 25 పార్లమెంట్ సీట్లు గెలిచి దిల్లీలో చక్రం తిప్పబోయేది చంద్రబాబే. ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావాల్సిన హోదాతో పాటు 18 అంశాలను తీసుకొచ్చే బాధ్యత తెదేపా ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.