Thursday, May 2, 2024
- Advertisement -

అభ్యర్థులను మార్చకపోతే టిడిపి 3 సీట్లలో కూడా గెలవదుః జేసీ

- Advertisement -

‘2019 ఎన్నికల్లో అభ్యర్థులను మార్చకపోతే టిడిపి 3 సీట్లలో కూడా గెలవదు. అభ్యర్థుల ఎంపిక అంతా చంద్రబాబు ఇష్టం. అయినప్పటికీ అభ్యర్థులను మార్చకపోతే మాత్రం టిడిపికి చిప్పే గతి’…………మహానాడులో రెచ్చిపోయి వైఎస్‌లపై నోరుజారి సామాన్య ప్రజలచేత కూడా తిట్టించుకుంటున్న జేసీ దివాకరరెడ్డి పలుకులు ఇవి. అనంతపురం జిల్లాల్లో టిడిపికి ఉన్న పట్టు గురించి కొత్తగా చెప్పేది ఏముంది? 204 ఎన్నికల్లో కూడా రుణమాఫీల పుణ్యమాని ఓట్లు కొల్లగొట్టాడు చంద్రబాబు. అయితే ఆ తర్వాత ఓట్లేసిన అందరికీ చిప్పే చూపించాడనుకోండి.

అయితే ఈ సారి మాత్రం 2019 ఎన్నికల్లో అనంతపురం ప్రజలు టిడిపిని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారట. 2014 ఎన్నికల్లో దాదాపు క్లీన్ స్వీప్ చేసిన జిల్లాలో ఈ సారి టిడిపికి మూడు సిట్లు రావడం కూడా కష్టమేనని తీర్మానించేశాడు జేసీ. ఆ స్థాయిలో టిడిపిపై వ్యతిరేకత ఉందట. అయితే అభ్యర్థులను మార్చి కొత్త ముఖాలతో రంగంలోకి దిగితే మాత్రం టిడిపి గెలవడానికి మెరుగైన అవకాశాలు ఉంటాయని ఒక చిన్న క్లాజ్ కూడా యాడ్ చేశాడు జేసీ. చంద్రబాబుకు నేను ఎన్నికల అభ్యర్థుల జాబితా పంపిస్తానని………..ఆ ప్రకారమే సీట్లు ఇస్తే టిడిపి గెలుస్తుందని లేకపోతే మాత్రం ఘోర పరాజయం ఖాయమని చెప్పుకొచ్చాడు జేసీ. ఏది ఏమైనా మహానాడు సాక్షిగా చంద్రబాబు పాలన బ్రహ్మాండం……..చినబాబు సిఎం అయితే ఇంకా బ్రహ్మాండం. అనంతపురం ప్రజలు అయితే ఆనందం పట్టలేక తాండవం చేస్తున్నారు అనే రేంజ్‌లో పూనకాలు వచ్చినట్టుగా రెచ్చిపోయిన జేసీ రెండు రోజుల వ్యవధిలోనే వాస్తవాలు ఒప్పుకోవడం గమనార్హం. గతంలో సర్వేలన్నీ చెప్పినట్టుగానే 2019 ఎన్నికల్లో అనంతపురంలో తెదేపాకు మూడు సీట్లు కూడా దక్కవన్న నిజాన్ని జేసీ కూడా నిజాయితీగా ఒప్పుకోవడం గమనార్హం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -