- Advertisement -
రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యుల కొరత లేదని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ మండలిలో వెల్లడించారు. వైద్య కళాశాలల అనుబంధ దవాఖానాల్లో వైద్యులు తగినంత మంది ఉన్నారని స్పష్టం చేశారు.
ప్రభుత్వాస్పత్రుల్లో పని చేస్తూ… ప్రైవేటుగా ఆస్పత్రులు నిర్వహిస్తున్నారని… వేరే దవాఖానాల్లో ప్రైవేటుగా చికిత్సలు చేస్తున్నారని ఈటల ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి వారిని విధుల నుంచి తొలగిస్తేనే… ఈ సమస్య పరిష్కారం అవుతుందన్నారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు 45 వేల మందికిపైగా రైతులకు రైతు బీమా పథకం అమలు చేసినట్లు శాసనమండలిలో వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి వెల్లడించారు. కేవలం ఐదారు రోజుల్లోనే ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నట్లు తెలిపారు.