- Advertisement -
తెలంగాణలో గత 24 గంటల్లో 491 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్రకారం… గత 24 గంటల్లో ముగ్గురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 596 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనా వల్ల తెలంగాణ ముఖ్య నేతలకు కరోనా సోకిన విషయం తెలిసిందే.
తాజాగా రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్కు కూడా కరోనా సంక్రమించింది. నిన్న ఆయనకు నిర్వహించిన పరీక్షల్లో వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. తనకు అస్వస్థతగా ఉండటంతో కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటీవ్ సోకినట్లు తెలిపారు.
ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని తన నివాసంలో క్వారంటైన్ కి వెళ్లినట్లు తెలిపారు. టీవల తనను కలిసిన ప్రతి ఒక్కరు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. తన ఆరోగ్యం బాగానే ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని అన్నారు.