తెలంగాణాలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడతున్న టీడీపీ ని చావు దెబ్బ కొట్టేందుకు రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నారు. ఆయన వెంట భారీ సంఖ్యలో నేతలు, కార్యకర్తలు, మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నట్లు తెలుస్తోంది. సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్న రేవంత్రెడ్డి మంగళవారం రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్లో చేరనున్నారు. దాదాపు అన్ని జిల్లాల నుంచి కీలక నేతలుగా ముద్రపడినవారిలో అధికులు రేవంత్ వెంట నడవబోతున్నట్లు తెలిసింది. వీరందరి కోసం ఇప్పటికే ఢిల్లీ కర్ణాటక భవన్లో గదులు బుక్ చేసినట్లు సమాచారం.
అయితె రేవంత్ వెంట పెద్దజాబితానె ఉన్నట్లు తెలుస్తోంది. రేవంత్ తో పాటు కాంగ్రెస్ లో చేరే టీడీపీ ముఖ్య నేతల్లో వేం నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సీతక్క, బోడ జనార్దన్, అరికెల నర్సారెడ్డి, సోయం బాపూరావు, భూపాల్ రెడ్డి తదితరులు ఉన్నట్టు సమాచారం.
వీరితో పాటు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, మొన్నటి ఎన్నికల్లో అభ్యర్థులు, మాజీ కార్పొరేటర్లు, విద్యార్థి సంఘం నేతల వరకు ఉన్నారు. వీరిలో చాలా మంది పాపులర్ నేతలేకాక, కష్టకాలంలో పార్టీని అంటిపెట్టుకుని ఉన్నవారే కావడం గమనార్హం. వారంతా ఇప్పుడు కాంగ్రెస్లోకి చేరుతుండటం టీడీపీకి చావుదెబ్బే అన్న భావన రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది.