తెలంగాణాటీడీపీకీ మరో భారీషాక్ తగలనుందా…? అంటే అవుననే సమాధానం వస్తోంది. సీనియర్నేత పార్టీకి గుడ్బాయ్ చెప్పనున్నారనే వార్త బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే టీడీపీ ఫైర్ బ్రాండ్గా పేరుపొందన రేవంత్రెడ్డి పార్టీని వీడి కాంగ్రెస్లో చేరిన సంగతి తెలసిందే. ఇప్పుడు మరో నేత పార్టీని వీడడానికి సిద్ధంగా ఉన్నారు. తెలంగాణాలో పార్టీ వెంటిలేటర్పై ఉంది.
తెలంగాణలో పరిచయం అక్కర్లేని సీనియర్ రాజకీయనేతల్లో మోత్కుపళ్లి నరశింహులు ఒకరు. తెలంగాణాలో పార్టీ బలోపేతంపై అధినేత సమావేశం ఏర్పాటు చేశారు. రెండు రోజులుగా నేతలతో చర్చలు జరిపారు. ఈ సమావేశాలకు మోత్కుపల్లి డుమ్మా కొట్టడంతో పార్టీ మారడం ఖాయమనే ఊహాగానాలు మొదలయ్యాయి.
పార్టీని విలీనం చేస్తామనే అధికారం మోత్కుపల్లి సహా ఎవరికీ లేదని… అలా ఎవరైనా మాట్లాడితే వారు పార్టీ వ్యతిరేకులేనని చెప్పారట. ఈ వ్యాఖ్యలు మోత్కుపల్లిని ఉద్దేశించనవని టాక్ నడుస్తోంది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే… పార్టీ మార్పు ఖాయమంటున్నారు.
గతంలో ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా మోత్కుపల్లి చేసిన వ్యాఖ్యలు కలకలంరేపాయి. టీఆర్ఎస్లో టీడీపీని విలీనం చేయాలనడం వివాదాస్పదమయ్యింది. అప్పటి నుంచి మోత్కుపల్లి పార్టీతో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. పార్టీ చేపడుతున్న కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారట. ఇప్పుడు పార్టీకి సంబంధించిన కీలక సమావేశాలకు ఆయన రాకపోవడంతో ఆయన్ను టీడీపీ లెక్కలో నుంచి తీసేసినట్లేనని ప్రచారం నడుస్తోంది. అయితే ఈ వార్తలపై మోత్తకుపల్లి క్లారిటీ ఇస్తారా అన్నది తేలాల్సిఉంది.