కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి, సరఫరాపై కేంద్రం కసరత్తు చేస్తున్న తరుణంలో.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న వ్యాక్సిన్ పరిశోధనలను శనివారం స్వయంగా సమీక్షించనున్నారు. టీకా అభివృద్ధిలో ముందున్న భారత్ బయోటెక్, సీరం ఇన్స్టిట్యూట్, జైడస్ క్యాడిలా సంస్థలను సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో టీకాపై మోదీ కీలక ప్రకటన చేస్తారా అని సర్వత్రా చర్చ జరుగుతోంది.
హైదరాబాద్ నుంచి మోదీ మహారాష్ట్ర పుణెకు వెళ్లనున్నారు. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(సీఐఐ)ను ప్రధాని సందర్శించనున్నారు.ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం రూపొందిస్తున్న టీకాను భారత్లో పంపిణీ చేసేందుకు ఆస్ట్రాజెనెకా సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది ఎస్ఐఐ. టీకా పంపిణీకి కేంద్రం ఏర్పాట్లు చేస్తున్న సమయంలో ప్రధాని ప్రత్యక్షంగా సీరం ఇన్స్టిట్యూట్ను సందర్శించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ప్రిడేటర్ డ్రోన్లను చూశారా..!
‘రంగ్ దే’ టీమ్ అంత ధైర్యం చేస్తుందా?