Thursday, April 25, 2024
- Advertisement -

20 నెలల అద్భుత పాలనకు ఇది రిటర్న్ గిఫ్ట్..!

- Advertisement -

సీఎం జగన్ 20 నెలల అద్భుత పాలనకు పురపాలక ఎన్నికల ఫలితాలే నిదర్శనమని వైసిపి ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పష్టం చేశారు. వైసిపి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి ప్రజలు తీర్పు ఇచ్చారని వెల్లడించారు. సాధారణ ఎన్నికల్లో వచ్చిన ఫలితాల కంటే మెరుగైన ఫలితాలు వచ్చాయన్నారు.

రాష్ట్రంలో టిడిపి భూస్థాపితమైందని.., భవిష్యత్తులో ఆ పార్టీకి అభ్యర్థులు దొరకని పరిస్థితి ఎదురవుతుందన్నారు. ప్రజలు వైఎస్ జగన్ పాలన ను ఎంతగా మెచ్చుకుంటున్నారో అన్న విషయం ప్రతిపక్షనేతలు ఇప్పటికైనా గమనించాలి. అంతే కాదు ప్రతిపక్ష నేతలు అరచి గగ్గోలు పెడుతున్నారు.. కానీ ప్రజలు నిజాన్ని నమ్ముతున్నారు.

విశాఖ, గుంటూరు, విజయవాడలోనూ ప్రజలు వైసిపి అభ్యర్థులకు మద్దతు పలికారన్నారు. తద్వారా అక్కడి ప్రజలు మూడు రాజధానులకు మద్దతుగా ఉన్న విషయం తేటతెల్లమైందన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు నడిపిస్తోన్న రాజధాని ఉద్యమాలను మానుకోవటం మంచిదని సలహా ఇచ్చారు. వచ్చే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు పునరావృమవుతాయని ధీమా వ్యక్తం చేశారు.

శాతం పెరిగింది.. కేటీఆర్ కుష్ కుష్..!

స్వల్ప ఘర్షణల మినహా.. తెలంగాణలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్!

ధోనీ కొత్త అవతారం మిస్టరీ వీడింది!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -