మరికొన్ని గంటల్లోనే టీపీసీసీ ఎవరు? అనే విషయం తేలిపోనున్నట్టు సమాచారం. చాలా రోజులుగా వివిధ కారణాలతో పీసీసీ అధ్యక్ష పదవి పెండింగ్లో పడిన విషయం తెలిసిందే. సుదీర్ఘ కసరత్తుల అనంతరం కాంగ్రెస్ హైకమాండ్ ఓ నిర్ణయానికి వచ్చిందట. సోమవారం రాత్రి వరకు ఏఐసీసీ టీపీసీసీ అధ్యక్షుడి ప్రకటన చేయబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ పదవి కోసం కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు.
ఇప్పటికే వీళ్లిద్దరూ ఢిల్లీ వెళ్లినట్టు సమాచారం.
మరోవైపు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, మరో కాంగ్రెస్ నేత మధు యాష్కి గౌడ్ సైతం ఢిల్లీకి వెళ్లారు. ఈ క్రమంలో పీసీసీ అధ్యక్ష పదవి ఎవరికి ఇవ్వబోతున్నారన్న విషయం ఆసక్తికరంగా మారింది. ఢిల్లీలో ఎవరికి వారు తమ స్థాయిలో లాబియింగ్ చేసుకుంటున్నట్టు సమాచారం. ఇటీవల అనూహ్యంగా మధుయాష్కి గౌడ్ పేరు తెరమీదకు వచ్చింది. మధు యాష్కి బీసీ కార్డు ప్రయోగిస్తున్నట్టు సమాచారం.
Also Read: ఏపీలో పరీక్షలు ఉంటాయా? ఉండవా? మంత్రి క్లారిటీ..!
అయితే అధిష్ఠానం మాత్రం రేవంత్రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. శుక్రవారం సాయంత్రం ఆయన కుటుంబంతో కలిసి ఢిల్లీకి వెళ్లారు. మరో కీలక నేత కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తన స్థాయిలో ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అయితే ఆయనను కాంగ్రెస్ హైకమాండ్ బుజ్జగించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. తమిళనాడు నుంచి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్కం ఠాగూర్ అర్జెంట్గా ఢిల్లీకి వెళ్లారు. ఆదివారం సాయంత్రం లేదా సోమవారం పీసీసీ అధ్యక్ష ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం.
Also Read: ఇలా అయితే కష్టం..! చంద్రబాబు, లోకేశ్పై క్యాడర్ నిరుత్సాహం