ఆంధ్రప్రదేశ్లో టెన్త్, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై సందిగ్ధత నెలకొన్నది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో పరీక్షలను రద్దుచేశారు. కేంద్ర ప్రభుత్వం సైతం సీబీఐటీ పరీక్షలు రద్దు చేసి విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేసింది. ఏపీలో మాత్రం పరీక్షలు నిర్వహించి తీరుతామని ప్రభుత్వం అంటున్నది.ప్రతిపక్షాలు, విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం.. పరీక్షలు రద్దు చేయాలని కోరుతున్నారు.
ఈ నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ‘ ఏపీలో పరీక్షలు నిర్వహిస్తాం. కానీ కరోనా కేసులు తగ్గాక, పరిస్థితులు అనుకూలించాకే పరీక్షలు నిర్వహిస్తాం. విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పరీక్షలు రద్దు చేయడం నిమిషం పని. కానీ విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకొని తాము ఈ నిర్ణయం తీసుకున్నాం.
Also Read: థర్డ్వేవ్.. చిన్నపిల్లల తల్లిదండ్రులూ బీకేర్ఫుల్..!
ప్రస్తుతం పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేదు. అందుకు కారణం కరోనా తీవ్రంగా ఉంది. విద్యార్థుల ఆరోగ్యం కూడా మాకు ముఖ్యమే. కరోనా కేసులు తగ్గాక.. విద్యార్థులకు ఏ ఇబ్బందులు లేవని తెలిసినప్పుడే పరీక్షలు నిర్వహిస్తాం. ఇందుకోసం నిపుణులతోనూ చర్చలు జరుపుతున్నాం.
ప్రతిపక్షాలు, ప్రైవేటు యాజమాన్యాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ప్రస్తుతం ఏపీలో కొత్తగా అడ్మిషన్లు తీసుకొనేందుకు అనుమతి లేదు. ఏ ప్రైవేట్ కళాశాల అయినా నిబంధనలకు విరుద్దంగా గనక అడ్మిషన్లు తీసుకుంటే కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. అందరికీ లోకేశ్ లాగా.. అంతర్జాతీయ యూనివర్సిటీల్లో చదువుకొనేందుకు అవకాశం ఉండదు. పేద విద్యార్థులకు భవిష్యత్ ఎంతో ముఖ్యం. నేను ఓ తండ్రిగా అయితే పరీక్షల నిర్వహించాలని కోరతాను. అదే సమయంలో విద్యార్థుల ఆరోగ్యం కూడా ముఖ్యమే’ అంటూ పేర్కొన్నారు మంత్రి ఆదిమూలపు సురేశ్.
Also Read: కళ్లను మాయ చేసే వీడియో.. ఆకు సీతాకొక చిలుకై ఎగిరిపోయింది..!