YSR తెలంగాణ పార్టీలో భారీగా చేరికలు జరుగుతున్నాయి. అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతున్న YSR తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల నాయకత్వంలో పనిచేసేందుకు పలు పార్టీల నాయకులు ముందుకొస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలోంచే కాకుండా అధికార పార్టీ టీఆర్ఎస్ నుంచి కూడా పలువురు నాయకులు YSR తెలంగాణ పార్టీలో చేరడం విశేషం. YSR తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల ఆద్వర్యంలో పలువురు టీఆర్ఎస్, బీజేపీ నాయకులు సోమవారం పార్టీలో చేరారు.
హైదరాబాద్ లోని మహేశ్వరం నియోజకవర్గం టీఆర్ఎస్ ఉపాధ్యక్షులు ఎడమ మోహన్ రెడ్డి తన అనుచరులతో కలిసి YSR తెలంగాణ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మలక్ పేట్ బీజేపీ నాయకులు, ట్రేడర్ సెల్ సిటీ అధ్యక్షులు నవీన్ రావు, మలక్ పేట్ బీజేపీ సీనియర్ నాయకులు రవికుమార్ చౌకి తమ అనుచరులతో కలిసి YSR తెలంగాణ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వైయస్ షర్మిల వారందరికీ పార్టీ కండువా వేసి YSR తెలంగాణ పార్టీలోకి ఆహ్వానించారు.
బీజేపీ వ్యూహాత్మక విజయం సాధించిందా..?