- Advertisement -
తాజా అసెంబ్లీ ఎన్నికల్లో 88 స్థానాలతో టీఆర్ఎస్ విజయదుందుభి మోగించడంతో.. ఆ పార్టీ అధినేత కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసేందుకు రెఢీ అవుతున్నారు. టీఆర్ఎస్ తాజా ఎమ్మెల్యేలంతా తెలంగాణ భవన్లో సమావేశమైన అసెంబ్లీలో తమ నేతగా కేసీఆర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
మరి కొద్ది సేపట్లో గవర్నర్ నరశింమన్ను కేసీఆర్ కలసి ఏకగ్రీవ తీర్మానం అందజేయనున్నారు. క్రితంసారి మాదిరే, ఆయన రాజ్భవన్ వేదికగా ప్రమాణం చేయనున్నారు. అందుకు సంబంధించి రాజ్భవన్లో అన్ని ఏర్పాట్లూ జరుగుతున్నాయి. గురువాం మధ్యాహ్నం 1.30 లకు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నట్టు సమాచారం. కేసీఆర్తో పాటు ఒకరు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారనే వార్తలు టీఆర్ఎస్ భవన్ వర్గాలనుంచి వస్తున్న సమాచారం.