గత కొంత కాలంగా తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ల మద్య మాటల యుద్దం కొనసాగుతుంది. దానికి తోడు ఇటీవల దుబ్బాకలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేయడం.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అధిక శాతం ఓట్లు రాబట్టుకోవడం జరిగింది. అయితే అధికార పార్టీ అసమర్థత వల్ల ప్రజల ఇలాంటి తీర్పు ఇచ్చారని బీజేపీ అంటుంది.
తాజాగా కేంద్రం ఇచ్చిన నిధులు పక్కదారి పట్టించారని బీజేపీ ఆరోపిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు కేంద్రం తెలంగాణకు చాలా అన్యాయం చేసిందని.. కేంద్రం తెలంగాణకు ఇవ్వాల్సిన లక్షా 30 వేల కోట్లు ఎగ్గొట్టిందన్నారు.
ఇది వాస్తవం కాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి నిరూపిస్తే తాను జనగామ నియోజకవర్గంలో అర్ధనగ్న ప్రదర్శన చేస్తానని కామెంట్స్ చేశారు. వారికి చిత్త శుద్ది ఉంటే కేంద్రం ఇవ్వాల్సిన నిధులు ఇప్పించాలని అన్నారు.
మరిన్ని వార్తల కోసం ఈ లింకులు క్లిక్ చేయండి :
కొత్త గెటప్ తో ‘ఏ1 ఎక్స్ ప్రెస్’ సందీప్ కిషన్ ఫస్ట్ లుక్ విడుదల!
స్థానిక ఎన్నికలకు సహకరించం : ఏపీ ఉద్యోగ సంఘాలు
కేంద్రాన్ని పట్టించుకోని మమతా 50 శాతం నుంచి 100 శాతానికి పెంపు..!