Thursday, April 25, 2024
- Advertisement -

ఇదిగో టీడీపీ నిజస్వరూపం…!

- Advertisement -

ఏపీలో డ్రగ్స్ కేసుకు సంబంధించి టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ సీఎం వైయస్ జగన్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలు… వైసీపీ కార్యకర్తలు టీడీపీ కార్యాలయం, పట్టాభి ఇంటిపై దాడి.. పట్టాభి అరెస్ట్‌.. రాష్ట్రంలో రాజకీయం హీటెక్కిస్తోంది..

అయితే తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికర వీడియోను ట్వీట్ చేశారు. “ఇదిగో టీడీపీ నిజస్వరూపం. టీడీపీ హయాంలో అప్పటి మంత్రి గంటా ఒక ప్రెస్ మీట్లో చేసిన వ్యాఖ్యలు ఇవి. మరి లోకేష్ నాయకత్వంలో అయ్యన్న, వెలగపూడి, అప్పటి విశాఖ రూరల్ ఎస్పీ కోయ ప్రవీణ్ ల గంజాయి వ్యాపార భాగస్వామ్యం గురించి గంట మోగించారో లేక బాబు పాత్రపై అనుమానమో కానీ విషయం మాత్రం ఇది.”

ఈ వీడియోలో గంటా మాట్లాడుతూ, విశాఖ నుంచే దేశమంతా గంజాయి సరఫరా అవుతోందని వెల్లడించారు. ఆ క్రెడిట్ మన నగరానికే దక్కిందంటూ చంద్రబాబు కూడా చమత్కారంగా మాట్లాడారని గంటా నవ్వులు పూయించడం ఆ వీడియోలో చూడొచ్చు. దీనిపై విజయసాయి స్పందిస్తూ, మరి లోకేశ్ నాయకత్వంలో అయ్యన్న, వెలగపూడి, నాటి విశాఖ రూరల్ ఎస్పీ కోయ ప్రవీణ్ ల గంజాయి వ్యాపార భాగస్వామ్యం గురించి గంట మోగించారో లేక బాబు పాత్రపై అనుమానమో కానీ…. విషయం మాత్రం ఇదీ అంటూ వివరించారు.

-Anjanreddy Kodathala

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -