తెలుగు తెరపై 90వ దశకంలో తన అందచందాలతోనే కాదు.. యాక్షన్ తో దుమ్ముదుళిపింది నటి విజయశాంతి. లేడీ అమితాబ్ గా పేరు తెచ్చుకున్న విజయశాంతి అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చింది. మొదట బీజేపీ తీర్థం పుచ్చుకున్నా తర్వాత తెలంగాణ ఉద్యమ సమయంలో అమ్మతెలంగాణ పార్టీ స్థాపించింది. ఆ తర్వాత టీఆర్ఎస్ లో విలీనం చేసింది. మెదక్ ఎంపీగా కొనసాగిన విజయశాంతి తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ తో విభేదాలు రావడంతో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లింది.
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు విజయశాంతి. ఈ మద్య ఆమె బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఫేస్బుక్లో పలు పోస్టులు చేసి ఆమె కాంగ్రెస్ పార్టీ వీడబోనని సంకేతాలు ఇచ్చారు.
‘రాష్ట్ర కాంగ్రెస్లో కొందరు నాయకులు చానెల్స్లో లీకేజీల ద్వారా నాపై వ్యతిరేక వ్యాఖ్యలు చేయిస్తున్నారు. వాస్తవాలను మాట్లాడిన మధుయాష్కీగారికి నా ధన్యవాదాలు’ అని ఆమె అన్నారు. అంతే కాదు ఆమె దీనికి సంబంధించిన ఓ ఇమేజ్ కూడా తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు.
టీఆర్ఎస్ వ్యూహాన్ని మార్చే టైం వచ్చిందా..?
పవన్ కళ్యాణ్ పొలిటికల్ మ్యానరిజం ని మిస్ అవుతున్నారట..!