ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ టీడీపీలో వర్గ విబేధాలు బయటపడుతున్నాయి. ప్రజాసంకల్ప పాదయాత్రలతతో జగన్ దూసుకుపోతుంటే టీడీపీ మాత్రం వర్గపోరుతో సతమత మవుతోంది. ఈ వర్గ పోరు అనంతపురంజిల్లాలో తారస్థాయికి చేరకుంది. సొంత పార్టీ నేతలే ఒకరి మీద ఒకరు సవాల్లు విసురుకుంటుంటే ఏంచేయాలో తెలియక సీఎం చంద్రబాబు చేతులెత్తేసే పరిస్థితి వచ్చింది.
తాజాగా అనంతపురం టీడీపీలో నిగురు కప్పిన నిప్పులా ఉన్న వర్గపోరు మరో సారి బయటపడింది. టీడపీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి ఎంపీ జేసీ దివారక్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. దివాకర్ రెడ్డిపై చౌదరి తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు. జేసీకి వయస్సు మీద పడింది కానీ బుద్ధి రాలేదని అన్నారు. జేసీకి సభ్యత, సంస్కారం అసలుకు లేవు, అందుకే నీ అమ్మా, అబ్బా అంటూ తిడుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. జిల్లాలో దివాకర్ రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.
జేసీ దివాకర్ రెడ్డి ఆగడాలకు తాను వ్యతిరేకంగా పోరాటం చేస్తానని అన్నారు. జేసీ తాటాకు చప్పళ్లకు బెదిరేది లేదని, దివాకర్ రెడ్డి వైఖరి దొంగే దొంగ అన్నట్లుగా వ్యహరిస్తున్నారని వాఖ్యానించారు. అనంతపురం జిల్లాలో జేసీ దౌర్జన్యాలను సహించేది లేదన్నారు.