Tuesday, April 23, 2024
- Advertisement -

బిజేపి మేయర్ అభ్యర్ధులు వీరే..!

- Advertisement -

నేడు జీహెచ్​ఎంసీ పాలకవర్గం కొలువుదీరనున్న నేపథ్యంలో బిజేపి కార్పొరేటర్లు బషీర్​బాగ్ ఆలయాన్ని సందర్శించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఎమ్మెల్సీ రాంచందర్​ రావు.. బిజేపి మేయర్ అభ్యర్థిగా ఆర్కేపురం కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డి, డిప్యూటి మేయర్ అభ్యర్థిగా రాంనగర్ కార్పొరేటర్ రవిచారి పేర్లను ప్రకటించారు.

పూజల అనంతరం బషీర్​బాగ్ ఆలయం నుంచి బిజేపి కార్పొరేటర్లు వెజ్​పార్క్​ హోటల్​కు వెళ్లారు. అక్కడినుంచి జీహెచ్​ఎంసీ కార్యాలయానికి వెళ్లారు.

మరోవైపు తెలంగాణ భవన్‌లో పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్​తో టి.ఆర్.ఎస్ కార్పొరేటర్లు సమావేశమయ్యారు. వారికి కేటీఆర్​ దిశా నిర్దేశం చేశారు. మేయర్‌ ఎన్నికపై అనుసరించాల్సిన విధానాన్ని ఆయన వివరించారు. అక్కడ నుంచి టి.ఆర్.ఎస్ కార్పొరేటర్లు ప్రత్యేక బస్సులో జీహెచ్​ఎంసీ కార్యాలయానికి వెళ్లనున్నారు.

Also Read

విజయ్ దేవరకొండ ‘లైగర్’ డేట్ ఫిక్స్!

బ్రౌన్ రైస్ తో ఎంతో మంచి ఆరోగ్యం!

షర్మిల అదేరోజు పార్టీ పేరు ప్రకటిస్తారా?

ఎవరైనా పార్టీ పెట్టుకునే స్వేచ్ఛ ఉంది : పవన్ కళ్యాన్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -