సుధీర్ఘ నిరీక్షణకు తెరపడబోతున్నాదా? ఇవాళో, రేపో టీ పీసీసీ అధ్యక్షుడు ఎవరు? అన్న విషయం తేలిపోనున్నాదా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. నిజానికి చాలా రోజుల క్రితమే ఉత్తమ్ కుమార్ రెడ్డి టీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామాను అధిష్ఠానానికి పంపించారు. కానీ హైకమాండ్ మాత్రం ఈ విషయంలో ఏ నిర్ణయమూ తీసుకోలేదు. ఉత్తమ్ కుమార్రెడ్డినే తాత్కాలికంగా కొనసాగించాలంటూ కోరింది..
కొత్త పీసీసీ అధ్యక్షుడు ఎంపిక విషయంలో నాన్చుడు వైఖరిని అవలంభించింది. మరోవైపు తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్కం ఠాగూర్ సైతం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు. కాంగ్రెస్ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు, సీనియర్ నేతలను కలుసుకొని అభిప్రాయ సేకరణ చేపట్టారు. పీసీసీ ఎంపిక ఓ కొలిక్కి వచ్చిందన్న వార్తలు వినిపించాయి. రేవంత్రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వబోతున్నారని వార్తలు వచ్చాయి.
ఇంతలోనే మళ్లీ జీవన్ రెడ్డి పేరు తెరమీదకు వచ్చింది. రేవంత్రెడ్డికి ప్రచార కార్యదర్శి పోస్టు ఇవ్వబోతున్నారన్న వార్తలూ వచ్చాయి. ఆ లోపే సాగర్ ఉప ఎన్నిక రావడంతో .. ఈ ప్రక్రియకు మరోసారి బ్రేక్ పడింది. అయితే తాజాగా పీసీసీ చీఫ్.. పదవికి ఎండ్ కార్డ్ పడబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇవాళ ఉదయం మాణిక్కం ఠాగూర్ హుటాహుటిన ఢిల్లీకి చేరుకున్నారు. మరోవైపు రేవంత్రెడ్డి క్యాంపు మాత్రం.. తమ నేతకే పదవి రాబోతుందంటూ ప్రచారం మొదలు పెట్టింది.
కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు. దీంతో ఉత్కంఠ నెలకొన్నది. రేవంత్రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వబోతున్నారని.. కోమటిరెడ్డి తదితర సీనియర్ నేతలను నచ్చజెప్ప బోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇవాళో రేపో ఈ ఉత్కంఠకు తెర పడనునన్నట్లు సమాచారం.
Also Read