ఫిరాయింపుల విషయంలో మేము చేస్తె సంసారం…ఇతరులు చేస్తె వ్యభిచారం అన్న చందంగా తయారయ్యింది టీడీపీ అధినేత చంద్రబాబు పరిస్థితి. రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా చేయాలని నిస్సిగ్గుగా ఫిరాయింపులను ప్రోత్సహించిన బాబుకు ఇప్పుడు అవే చుక్కలు చూపిస్తున్నాయి. ఎక్కడికెల్లినా పిరాయింపులపై ప్రతిపక్షాలకు సమాధానం చెప్పుకోలేని దైర్భాగ్యస్థితిలో ఉంది టీడీపీ.
పదిరోజులక్రితం శిల్పా చక్రపాణిరెడ్డి రాజీనామాను ఆమోదించిన సంగతి తెలసిందే. దీనిపై జగన్తోపాటు ఇతర పార్టీ నాయకులు రగిలిపోతున్నారు. శిల్పా రాజీనామాను ఆమోదింపచేసిన బాబుగారు..మిగిలిన 21 మంది ఎమ్మెల్యేల రాజీనామాలు ఎందుకు చేయించలేదని జగన్ నిలదీస్తున్నారు.
ఫిరాయింపు ఎమ్మేల్యేల చేత రాజీనామ చేయించకుండా చట్టంలో ఉన్న లొసుగులను ఉపయేగించుకొంటున్నారన్న సంగతి తెలిసిందే. అందుకే ఈ సారి బాబుకు,ఫిరాయింపు మంత్రులకు దిమ్మతిరిగే మాస్టర్ ప్లాన్తో రెడీ అవుతన్నారంట. నంద్యాల ఉప ఎన్నిక తర్వాత ఫిరాయింపు ఎమ్మెల్యేకుతోడు బాబుకు కూడా ఎవరూ ఊహించని దిమ్మతిరిగే షాక్ ఇవ్వబోతున్నారు.
ప్రజా క్షేత్రంలో ఎవరైనా ప్రజలకు తలవంచాల్సిందే. అక్కడ లొసుగులున్న ఏచట్టాలు పనిచేయవు. నంద్యాలలో గెలిచిన తర్వాత స్థానిక కేడర్, ప్రజలతో పిరాయింపు ఎమ్మేల్యేల నియేజక వర్గాల్లో ధర్నాలు చేయడానికి రెడీ అవుతున్నారంట. ప్రజల నుంచి వీరిపై వ్యతిరేకత వచ్చే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని నిర్నయం తీసుకున్నారంట జగన్.
తాము ఓటు వేసి గెలిచి తమకు ఇష్టంలేని పార్టీలో వెల్లే హక్కు ఎవరిచ్చారనే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెల్లనున్నారంట. ఈ విధమైన వ్యతిరేకత క్షేత్రస్థాయినుంచి వస్తే టీడీపీకి కోలుకోలేని దెబ్బే. ఇప్పటికే ప్రజలనుంచి, ఇతర వర్గాలనుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఒక వేల ఫిరాయింపు ఎమ్మేల్యేలు రాజీనామాలు చేసి ఎన్నికలకు వెల్తే వారికి ఓటమి తప్పదని..అందుకే జగన్ భారీ వ్యూహంతో ముందుకెల్తున్నారు.