Saturday, May 18, 2024
- Advertisement -

ఇంకెత‌కాలం పోలీసుల‌ను అడ్డుపెట్టుకుంటారు, ట్విట్ట‌ర్‌లో బాబుపై మండిప‌డిన జ‌గ‌న్‌….

- Advertisement -

గుంటూరు జిల్లా గుర‌జాల‌లో అక్ర‌మ వైంనింగ్ కుంభ‌కోణాన్ని ప‌రిశీలించ‌డానికి వెల్తున్న వైసీపీ నిజ‌నిర్ధాన క‌మిటీని పోలీసులు అడ్డుకున్నారు. ఆ పార్టీ నేత‌ల‌ను హౌజ్ అరెస్ట్ చేశారు. 144 సెక్స‌న్ అమ‌లు చేశారు పోలీసులు. పార్టీ నిజ‌నిర్ధార‌ణ క‌మిటీనీ అడ్డుకోవ‌డంపై ట్విట్ట‌ర్‌లో చంద్ర‌బాబుపై జ‌గ‌న్ విరుచుకు ప‌డ్డారు.

గురజాలలో మైనింగ్ కుంభకోణాన్ని పరిశీలించడానికి తమ పార్టీ నిజనిర్ధారణ కమిటీ వెళ్తే అక్రమంగా అరెస్ట్ లు చేశారని జగన్ విమర్శిస్తూ ఓ ట్వీట్ చేశారు. చంద్రబాబు తప్పులు కప్పిపుచ్చుకోవడానికి 144 సెక్షన్ పెట్టారని విమర్శించారు. చంద్రబాబు అక్రమాలు, కుంభకోణాలు బయటపడకుండా ఉండేందుకు ఆయన వ్యతిరేకంగా నినదిస్తున్న గొంతులను నొక్కడానికి, ఇంకెంత కాలం పోలీసులను ఆయన అడ్డుపెట్టుకుంటారని ఆ ట్వీట్ లో ప్రశ్నించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -