వైఎస్ జగన్ ప్రజాక్షేత్రంలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. గత నెల 25న హైదరాబాద్ కు వెళుతున్న జగన్ పై విశాఖపట్నం ఎయిర్ పోర్టులో శ్రీనివాసరావు అనే యువకుడు కోడి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో గాయపడ్డ జగన్ హైదరాబాద్ లోని సిటీ న్యూరో ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకున్న జగన్ విశ్రాంతి తీసుకుంటున్నారు. పాదయాత్ర మొదలు పెట్టాలని భావించినా గాయం తగ్గకపోవడంతో డాక్టర్ల సలహాతో వాయిదా వేసుకున్నారు.
ఇప్పటికే జగన్ పాదయాత్రకు రెండు వారాలు బ్రేక్ పడటంతో జననేతను చూసేందుకు ఉత్తరాంద్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. గాయం మానడానికి మరిన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని కుటుంబ సభ్యులు, నాయకులు కోరుతున్నా జగన్ మాత్రం పదయాత్రకు రెడీ అవుతున్నారు. జగన్ ఈ నెల 12 నుంచి విజయనగరం జిల్లాలో ప్రజాసంకల్ప యాత్రలో పాల్గొంటారని వైసీపీ నేతలు తెలిపారు. ఇందుకోసం జగన్ వచ్చే ఆదివారం విశాఖకు బయలుదేరి వెళతారన్నారు.
ఇప్పటి వరకు జరిగిన పాదయాత్ర ఒక ఎత్తైతే..ఇప్పుడు జరగబోతున్న పాదాయత్ర మరో ఎత్తు.దాడి ఘటన తర్వాత ప్రజల్లో మరింత సానుభూతి పెరిగింది.దీంతో పాదయాత్ర మరింత జనం ప్రభంజనంలా వస్తారని నేతలు భావిస్తున్నారు. జగన్ను డాక్టర్లు మరో సారి పరీక్ష చేయనున్నారు. గాయం తగ్గిందని డాక్టర్లు భావిస్తే పాదయాత్రకు అనుమతిస్తారు. ఇది పార్టీ శ్రేణులలో మరింత జోష్ పెంచనుంది.