Saturday, April 27, 2024
- Advertisement -

నేడు లోటస్ పాండ్ లో విద్యార్థులతో షర్మిల సమావేశం!

- Advertisement -

తెలంగాణ లో వైఎస్ షర్మిల దూకుడు పెంచారు. ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు, సానుభూతి పరులతో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. త్వరలో ఆమె కొత్త పార్టీ ఏర్పాటు చేయడానికి సంసిద్దం అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణలో పార్టీ స్థాపన ప్రయత్నాల్లో ఉన్న వైఎస్ షర్మిల నేడు లోటస్ పాండ్‌లో విద్యార్థులతో సమావేశం కానున్నారు.

దాదాపు 350 మంది విద్యార్థులు పాల్గొననున్న ఈ సమావేశంలో విద్యార్థుల సమస్యలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అమలు తీరు తదితర అంశాలపై చర్చించనున్నారు. రాష్ట్రంలో విద్యార్ధులు ఎదుర్కోంటున్న సమస్యలతో పాటు పార్టీ ఏర్పాటుపై వారి అభిప్రాయాలను కూడా షర్మిల తెలుసుకునే అవకాశం ఉంది.

కాగా, రాష్ట్రంలోని వివిధ జిల్లాల నేతలతో ఇటీవల వరుసగా భేటీ అవుతున్న షర్మిలను నిన్న ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, ఆదిలాబాద్ నుంచి వచ్చిన పలువురు అభిమానులు లోటస్‌పాండ్‌లో కలిశారు. ఇప్పటి వరకు షర్మిలను కలిసిన వారిలో సీనియర్ జర్నలిస్టు లు కూడా ఉన్నారు. ఇక జనగామ మునిసిపాలిటీ మాజీ చైర్మన్‌ సుధాకర్‌, మాజీ ఎంపీపీ గోవర్ధన్‌రెడ్డి తదితరులు కూడా ఉన్నారు.

బీజేపీ నేత విష్ణు ను టీడీపీ కి నాయకుడు శ్రీనివాసరావు లైవ్ లో చెప్పుతో దాడి!

ప‌వ‌న్ సినిమాకు అలీ పెట్టుబ‌డి?

అదిరిపోయే ధ‌ర‌కు కేజీఎఫ్ తెలుగు రైట్స్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -