పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. వకీల్ సాబ్ పూర్తి కావస్తున్న సమయంలో మరో రెండు సినిమాలను సెట్స్ పైకి తీసుచొచ్చేశాడు. సాగర్ కె చంద్ర శేఖర్ డైరెక్షన్ లో అయ్యప్పనుమ్ కోషియమ్ అనే సినిమాను రీమేక్ చేస్తున్నాడు. తరువాత క్రిష్ డైరెక్షన్లో మరో సినిమా తియనున్న సంగతి తెలిసిందే.
మళ్లీ ఇప్పుడు గోపాల గోపాల ఫేం కిషోర్ కుమార్ పార్ధనాసి తో ఒక సినిమా చేయబోతున్నాడని సమాచారం. అయితే ఈ సినిమాకు టాప్ కమెడియన్ నిర్మాతగా పని చేయనున్నారని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్, కమెడీయన్ అలీ మధ్య ఉన్న స్నేహం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కానీ గత కొన్నిరోజులుగా వీరిద్ధరి మధ్య మనస్పర్థలు వచ్చిన విషయం తెలిసిందే.
అది కూడా రాజకీయంగా. కానీ ఇప్పడు వీరిద్దరి మధ్య మళ్లీ స్నేహం పెరిగిందని చెప్పాలి. ఒక వేడుకలో ఇద్దరు కలిసి ఎంతో స్నేహంగా కలిశారు. ఫొటోలు కూడా దిగారు. ఇవి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ అవుతున్నాయి. అలీ ఇటీవలే నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. అయితే గోపాల గోపాల ఫేం కిషోర్ కుమార్ పార్ధసాని దర్శకత్వం వహించే పవన్ సినిమాకు ఆలీ నిర్మాతగా పని చేయబోతున్నారని టాక్ వినిపిస్తుంది. నిజమో కాదో వేచి చూడాలి.
15యేళ్ల తర్వాత మెగాస్టార్ కు జోడిగా ఆ ముద్దుగుమ్మ!
మిస్సెస్ ఇండియా పోటీల్లో సత్తా చాటిన తెలుగు యువతి !
ఎన్టీఆర్ తో తలబడుతున్న విజయ్ సేతుపతి !